( న్యూఢీల్లీ, న్యూస్ఇన్)
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశ పెట్టాలని భావించింది. మహిళా రిజర్వేషన్ బిల్లును అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించినట్లు ప్రకటన చేసినా పార్లమెంట్ లో జరిగిన మాత్రం బిల్లుకు ఆ స్థాయిలో మద్దతు దక్క లేదు. మహిళా బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలినట్లయింది. విపక్ష పార్టీలు ముందు నుంచి మహిళా బిల్లు తో పాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. కేంద్ర ప్రభుత్వం కుట్రతోనే ఇలా వ్యవహరించిందన్న వాదనను బలంగా వినిపించాయి.131 రాజ్యంగ సవరణ చేసేందుకు ప్రవేశ పెట్టిన బిల్లుపై జరిగిన ఓటింగ్ లో 528 మంది సభ్యులు పాల్గొన్నారు. బిల్లుకు అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు. మూడింట రెండొంతుల మద్దతు దక్కకపోవడంతో బిల్లు వీగిపోయినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఎన్నికలకు మందు కేంద్ర ప్రభుత్వం ప్రత్యే క పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయడం, యుద్ధ ప్రతిపాదికన మహిళా రిజర్వేషన్ బిల్లు తో పాటు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కూడా ప్రవేశ పెట్టింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎన్నికలకు ముందు ఆడుతున్న డ్రామాగా విపక్ష పార్టీలు ముందు నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మహిళా బిల్లుపై జరిగిన ఓటింగ్ లో కేంద్రానికి షాక్ తగలడంతో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిరిణ్ రిజీజు ప్రకటించారు.
భారత దేశ చరిత్రలో మరుపురాని రోజు…
లోక్సభ విపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో ప్రజాస్వామ్య శక్తులు, ప్రతిపక్ష నాయకులు అంతా ఏకమై ఒక జాతీయ విపత్తును నివారించిన సందర్భం నల్ల బిల్లులను ఓడించేందుకు కఠిన పరిస్థితుల్లోనూ ఐకమత్యంతో, సాహాసంతో నిలిచిన మిత్రపక్షాల నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఢీల్లీని ఓడించామని తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు.












Leave a Reply