(హైదరాబాద్,న్యూస్ఇన్)
జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి దశాబ్దకాలం పాటు ప్రజాక్షేత్రంలో పోరాటాలు, అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు ప్రత్యక్షంగా చేపడుతున్న సేవలు అందిస్తోందని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. అభివృద్ధి పనులను అనుసరిస్తున్న ఇతర రాష్ట్రాల ప్రజలు తమ రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ ని విస్తరించాలని ప్రతిపాదనలు చేస్తున్నారని అందులో భాగంగానే తిరువనంత పురంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పర్యటించి తిరువనంత పురంలో జరిగిన సమావేశంలో స్థానిక నేతలతో నాగబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూర రామ్ లు చర్చించారు. పార్టీ బలోపేతం కోసం కేరళలో అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి పెట్టాలని నిర్ణయం తసీఉకున్నారు. ప్రాంతం ఏదైనా, భాష ఏదైనా జనసేన సిద్ధాంతాలు ఒకే విధంగా ఉంటాయని నాగబాబు వ్యాఖ్యానించారు. స్థానిక అంశాలు, సమస్యలకు అనుగుణంగా పార్టీ విధి, విధానాలు ఉంటాయని అన్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ భావజాలం భాషలకు, ప్రాంతాలకు అతీతంగా దేశస్థాయిలో ప్రజలను ఆకట్టుకుంటోందని, దక్షిణ భారతదేశం వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జనసేన పార్టీ విస్తరణ కోసం అభ్యర్థనలు వస్తున్నాయన్నారు. అభవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో పర్యటించి, జనసేన పార్టీ విస్తరణకు అవసరమైన ప్రయత్నాలు చేపడతామని వెల్లడించారు. జనసేన పార్టీ కార్యక్రమాల్లో అనుసరించే విధానాలను, సిద్ధాంతాలను కార్యకర్తలకు వివరించారు.

కేరళ నుండి జనసేనలో చేరికలు…….
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో జరిగిన సమావేశం అనంతరం నేషనల్ లేబర్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ, రాష్ట్రీయ లోక్దళ్, హిందుస్థాన్ అవమీ మోర్చా, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల నుండి 200 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. నాగబాబు, తాళ్లూరి రామ్ పార్టీ కండువాలు కప్పి వారందరినీ జనసేన పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ కార్యక్రమాల్లో అనుసరించే విధానాలను, సిద్ధాంతాలను కార్యకర్తలకు వివరించారు.








Leave a Reply