(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
గుజరాత్ టైటాన్స్ పై ముంబాయి ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించింది. వరుస ఓటములతో ఇబ్బందులు పడుతున్న ముంబాయి ఈ రోజు మ్యాచ్ లో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబాయి 200 పరుగుల విజయ లక్ష్యాన్ని గుజరాత్ టైటన్స్ ముందు ఉంచింది.15,5 ఓవర్లలో జీటీ వంద పరుగులకే అలౌట్ అయింది. దీంతో 99 పరుగుల తేడాతో ముంబాయి జట్టుకు విజయం వరించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబాయి జట్టులో తిలక్ వర్మ మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేదు.

కేవలం 45 బాల్స్ ఎదుర్కొని తిలక్ వర్మ 101 పరుగులు సాధించడంతో ముంబాయి ఇండియన్స్ 199 పరుగుల స్కోరు చేయగలిగింది. నుమన్ ధీన్ కూడా ముంబాయి జట్టు తరపున బ్యాటింగ్ లో రాణించడంతో జీటీపై భారీ విజయ లక్ష్యాన్ని ఉంచడంలో సక్సెస్ అయింది.ముంబాయి ఇండియన్స్ బ్యాటింగ్…..
వరుసగా వికెట్లు కోల్పోయిన గుజరాత్….
200 పరుగుల విజయ లక్ష్యంగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ ఆరంభం నుంచి బ్యాటింగ్ లో తడబడింది. పరుగుల ఖాతా మొదలు పెట్టకుండానే సాయి సుదర్శన్ వెనుదిరిగారు. మరో కీలక బ్యాట్స్ మెన్ జోస్ బట్లర్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. కెప్టన్ శుభ్ మన్ గిల్ కూడా ఈ మ్యాచ్ లో రాణించకపోవడంతో గుజరాత్ టైటన్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది.

గిల్ 14 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. గుజరాత్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఏ సమయంలో కూడా మ్యాచ్ గెలుస్తుందన్న నమ్మకం కనిపించ లేదు. వరుసగా వికెట్లు కోల్పోతుండడంతో పూర్తిగా ఢిపెన్స్ లో బ్యాటింగ్ చేసింది జీటీలో వాషింగ్టన్ సుందర్ చేసిన 26 పరుగులే అత్యధికం గా ఉన్నాయంటే ఆ జట్టు బ్యాటర్ల విఫలం స్పష్టంగా కనిపిస్తోంది. 200 పరుగులు ఛేజీంగ్ చేయడం పెద్ద ఇబ్బంది కాకపోయినా….బ్యాటింగ్ లో మంచి భాగస్వామ్యం నమోదు కాకపోవడం జీటీ ఓటమికి ప్రదాన కారణమైంది. ముంబాయి బౌలర్లలో అశ్విన్ కుమార్ 4 వికెట్లు తీసుకోగా, శాంట్నర్, ఏఎం ఘజన్ ఫర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.









Leave a Reply