(హైదరాబాద్,న్యూస్ఇన్)
నేటి ఆర్ధరాత్రి నుంచి ఆర్టీసి కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. కార్మిక సంఘాలతో చర్చలు కూడా జరిపేందుకు ఇప్పటి వరకు ఆసక్తిచూపలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును కార్మిక సంఘాలు తప్పుబడుతున్నాయి. పలు కార్మిక సంఘాలు ఏకమై జేఏసిగా ఏర్పడ్డాయి. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో 21వ తేదీ అర్ధరాత్రి సమ్మె బాట పట్టేందుకు కార్మిక సంఘాలు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి.అయితే ప్రైవేటు ఆపరేటర్లు మాత్రం సమ్మెకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసి కార్మికులు సమ్మె బాట పడితే…ఎలాంటిచర్యలు తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ఈ రోజు సాయంత్రం వరకు ప్రభుత్వం చర్చలు జరిపి ఎలాంటి నిర్ణయం వెల్లడించకపోతే ఆర్టీసి సమ్మె ఖాయంగా కనిపిస్తోంది. ఈతాము చేపట్టే సమ్మె సకల జనుల సమ్మెను తలపిస్తుందని ఆర్టీసి కార్మిక సంఘాలు ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వం మొండి గా వ్యవహరించి బస్సులను నడిపించే ప్రయత్నాలు చేస్తే ఎలా అడ్డుకోవాలో కూడా తమకు తెలుసని ఆర్టీసి కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ఆర్టీసి సమ్మెకు కల్వకుంట్ల కవిత సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆర్టీసిని ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

ప్రధాన డిమాండ్లు……
1.TGSRTC ని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేస్తు డేటాఫ్ అపాయింట్మెంట్ ను ప్రకటించాలని,*
2.యూనియన్లను పునరుద్ధరించాలని
- 2021, 2025 వేతన సవరణలు వెంటనే జరపాలని
4.TGSRTC లో కాంటాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొని నడపాలని,*
5.స్టాఫ్ చిల్డ్రన్స్ ఉద్యోగులను మూడు సంవత్సరాల కాంట్రాక్టు పద్ధతిని రద్దుచేసి రెగ్యులర్ ప్రాతిపదికన తీసుకోవాలని,*
6.చట్ట వ్యతిరేక డ్యూటీలు తీసివేయాలి
7.MTW యాక్ట్ ను అమలు చేయాలి
8.ఆర్టీసీలో కార్మికులు 7, 8 గంటలకు బదులుగా 14, 16 గంటలు డ్యూటీ చేయిస్తు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు….. వెంటనే కార్మికులపై పని భారాన్ని తగ్గించాలి.
9.రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని, రిటైర్మెంట్ అయిన రోజె మొత్తం డబ్బులు చెల్లించాలి






Leave a Reply