(మెదక్,న్యూస్ఇన్)
ప్రభుత్వం త్వరలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, నేతలు, కార్యకర్తలు సిద్దం కావాలని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు.సంగారెడ్డి పట్టణం లోని ఓ ప్రైవేట్ హోటల్ లో మంగళవారం సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరిగింది. డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యం లో జరిగిన ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి తో పాటు జహీరాబాద్ ఎంపి సురేష్ షెట్కార్ , మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు, పఠాన్ చెరు నియోజకవర్గ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ప్రభుత్వం , పార్టీ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్తేనే విజయం సాధిస్తామని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నామన్నారు. అయినప్పటికీ జిల్లాలో ఇంకా నాయకుల మధ్య సమన్వయం రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఇప్పటినుండే సన్నద్ధం కావాలి, పార్టీ నాయకుల మధ్య వర్గ పోరు ఉండొద్ద న్నారు. నాయకుల మధ్య అభిప్రాయ బేధాలు ఉండటం సహజమే.. కానీ వర్గ పోరు వల్ల పార్టీ కి నష్టం జరుగుతుందన్నారు. 200 కోట్లతో సింగూరు ప్రాజెక్టు ను టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేస్తామన్నారు. విద్య, వైద్యం, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత అని ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో ప్రభుత్వం ముందుకెళ్తోంది అని అన్నారు. మహిళా బిల్లు కు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని సెపరేట్ గా బిల్లు పెడితే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందన్నారు. డీలిమిటేషన్ ఉన్నా లేకున్నా మరోసారి రేవంత్ రెడ్డి నాయకత్వం లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా గెలిచాం, మన బలాబలాలు , లోపాల పై చర్చించుకోవాలి అన్నారు. వచ్చే ఎంపీ టీ సి , జెడ్పీటీసీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయం లో చర్చ జరగాలన్నారు. మూడేళ్ల కు పైగా మండలస్థాయి లో పనిచేసిన వారికి, జిల్లా స్థాయి లో పదవులు ఇచ్చి, వారి స్థానం లో మండలం లో కొత్తవారిని నియమించాలని సూచించారు. ప్రభుత్వం ఉన్నది కాబట్టి అభ్యర్థుల ఎంపిక లో పోటీ ఉందని, మన మధ్యే మనకే పోటీ వల్ల పార్టీ కి నష్ట జరుగుతుందన్నారు.మొన్న పార్లమెంట్ లో జరిగిన పరిణామాల ను, ఎందుకు మహిళా బిల్లు ను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందో , మహిళా బిల్లు విషయం లో బీజేపీ కుట్ర లను సైతం పార్టీ పరంగా చర్చ జరగాలి, ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ఓటర్ల జాబితా సవరణకు ఆదేశాలు….
జహీరాబాద్ ఎంపి సురేష్ షెట్కార్ మాట్లాడుతూ మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 70% మంది సర్పంచ్ లు గా గెలిచారన్నారు. నాయకుల మధ్య సమన్వయం ఉం డాలి, అన్ని నియోజకవర్గాల్లో సమన్వయం తో పని చేయా లని పిలుపునిచ్చారు. దేశం లో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రం లో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని, సన్న బియ్యం, ఇందిరమ్మ గృహ పథకాల పట్ల ప్రజల్లో మంచి స్పందన వస్తోందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం రైతు బంధు ను కొనసాగిస్తుంది అని వివరించారు. రాష్ట్రం లో ప్రతీ ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేసే విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టబోతుందన్నారు.వచ్చే ఎన్నికల్లో నూ కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని తెలిపారు.








Leave a Reply