(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తమ సర్వీసులను పెంపుతున్నట్లు మెట్రో ప్రకటించింది. మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో 4 నిమిషాలకో మెట్రో ట్రైన్ నడుపుతున్నట్లు తెలిపింది. నాగోల్-రాయదుర్గం మార్గంలో 3 నిమిషాల 40 సెకన్లకో మెట్రో ట్రైన్ నడుపుతున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు.
మియాపూర్ – ఎల్బీ నగర్ కారిడార్ : సాధారణంగా పీక్ అవర్స్లో 3 నిమిషాల 40 సెకన్లకు ఒక రైలు, నాన్-పీక్లో 4 నిమిషాల 50 సెకన్లకు ఒక రైలు. ఇప్పుడు రోజంతా 4 నిమిషాల 20 సెకన్లకు ఒక రైలు.
నాగోల్ – రాయదుర్గ్ కారిడార్ : సాధారణంగా నాన్-పీక్లో 5 నిమిషాల 20 సెకన్లకు ఒక రైలు. ఇప్పుడు రోజంతా 3 నిమిషాల 40 సెకన్లకు ఒక రైలు. సాధారణంగా వారపు రోజుల్లో ఉదయం 8 నుండి 10:30 వరకు, సాయంత్రం 5 నుండి 8 వరకు మాత్రమే 56 రైళ్లు నడిపేవారు. నాన్-పీక్ అవర్స్లో 44 రైళ్లకు తగ్గించేవారు. సమ్మె కారణంగా ఇప్పుడు ఆ తగ్గింపు ఉండదు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాత్రి 11 గంటల తర్వాత కూడా మెట్రో సర్వీసులు పొడిగించే అవకాశాన్ని ఎల్టీఎంఆర్హెచ్ఎల్ పరిశీలిస్తోందని స్పష్టం చేసిన హెచ్ఎంఆర్ఎల్ ఎండీ తెలిపారు.






Leave a Reply