
(హైదరాబాద్,న్యూస్ఇన్)
వేసవి మొదలైన నాటి నుంచి ఈ ఏడాది భానుడి ప్రతాపం చూస్తూనే ఉన్నాం….ఒక వైపు తీవ్రమైన ఊష్ణోగ్రతలు మరో వైపు వడగాల్పులతో ప్రజలు సతమతం అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో నాలుగైదు రోజుల పాటు తుఫాను ప్రభావంతా వాతావరణం కాస్త చల్లబడింది. ఇక అసలు వేసవి కాలం త్వరలో మొదలు కానుందని వెదర్ మెన్ ప్రకటించారు. శుక్ర, శనివారం నుంచి వేసవి కాలం 2.0 మొదలు కానుందని అంచనా వేశారు. ఉత్తర తెలంగాణా జిల్లాల్లో తీవ్ర మైన ఊష్ణోగ్రతలు, వడగాలులకు సిద్దంగా ఉండాలని హెచ్చరించారు. ఏప్రిల్ 2 4వ తేదీ నుంచి 29వ తేదీ వరకు పలు జిల్లాలో ఊష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రత్యేకంగా హైదరాబాద్ లో కూడా తీవ్రమైన వడగాలుల ప్రభావం కనిపించనుంది. అత్యధిక ఊష్ణోగ్రతల కారణంగా అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ వర్షాలు ఎలాంటి చల్లదనం ఇవ్వవని, కేవలం గాలిలో తేమ పెంచుతాయని వెల్లడించారు.






Leave a Reply