NewsInn

News in a Click

ప్ర‌జావాణికి డుమ్మా- క‌లెక్ట‌ర్ సీరియ‌స్

(పాల‌మూరు, న్యూస్ఇన్‌)

సమాచారం లేకుండా ప్రజావాణికి గైర్హాజరైన అధికారులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మానికి అధికారులు సైలెంట్ గా దూరంగా ఉండ‌డాన్ని క‌లెక్ట‌ర్ కుష్బు గుప్తా సీరియ‌స్ గా ప‌రిగ‌ణించారు. ఎందుకు హాజ‌రు కాలేదో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని నోటీసుల్లో ఆదేశించారు. అన్ని శాఖ‌ల అధికారుల‌ను ప్ర‌జావాణి కార్య‌క్ర‌మానికి ఆహ్వానించి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌న్న ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తి సోమ‌వారం అన్ని క‌లెక్ట‌ర్ కార్యాల‌య‌ల‌తో పాటు రాష్ట్ర స్థాయిలో ప్ర‌జా భ‌వ‌న్ లో ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తోంది. జిల్లాలోని స‌మ‌స్య‌ల పై ఆయా జిల్లాల ప్ర‌జ‌లు సోమ‌వారం రోజు త‌మ స‌మ‌స్య‌ల‌ను చెప్పుకునేందుకు ప్ర‌జావాణికి పెద్ద ఎత్తున వ‌స్తుంటారు.

నోటీసులు అందుకున్న అధికారులు……

  1. ఆర్అండ్‌బీ ఈఈ సంధ్య
  2. మైనార్టీ సంక్షేమాధికారి ఖయ్యూం
  3. ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
  4. మిషన్ భగీరథ ఈఈ శ్రీనివాస్
  5. ఈడ బ్ల్యూయియాబీడీ ఈఈ రాంచందర్
  6. లీగల్ మెట్రాలజీ అధికారి రవీందర్
  7. మార్క్‌ఫెడ్ డీఎం నర్సింహారావు
  8. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ డీఈఓ వాణిశ్రీ
  9. వర్క్స్ ఇన్‌స్పెక్టర్ రియాజ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *