
(వరంగల్, న్యూస్ఇన్)
ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మె ఉద్రిక్తంగా మారింది. తమ డిమాండ్లను పరిష్కరించాలని బుధవారం నుంచి ఆర్టీసి కార్మికులు సమ్మె బాట పట్టారు. రెండు రోజులుగా సమ్మె ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసి కార్మికుల సమ్మె గురించి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆతహత్యా యత్నం చేశారు. నర్సంపేటలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. చికిత్స నిమిత్తం ఆత్మహత్యా యత్నం చేసిన డ్రైవర్ ను వరంగల్ కు హుటా హుటిన కార్మికులు, పోలీసులు తరలించారు.






Leave a Reply