(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
ఐపీఎల్ టీంలలో మంచి బ్యాటింగ్ లైనప్ ఉందని భావించిన ముంబాయి ఇండియన్ జట్టును చెన్నై స్పిన్ బౌలర్ అకిల్ హుస్సేన్ తిప్పేశారు. తన స్పిన్ మాయాజాలంతో నాలుగు ఓవర్లలో ముంబాయి ఇండియాన్స్ నలుగురు బ్యాట్స్ మెన్లను ఔట్ చేయడంతో ఎంఐ కోలుకోలేదు. 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో దిగినా ఏ దశలోనే విజయం సాధిస్తుందన్న నమ్మకం లేకుండానే మ్యాచ్ ను పూర్తి చేసింది. 103 పరుగుల తేడాతో చెన్నై జట్టు విజయం దక్కించుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్, ముంబాయి ఇండియన్స్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై ముంబాయికి 208 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబాయి హోం గ్రౌండ్స్ లో జరిగిన మ్యాచ్ లో సంజు మరో సారి చెలరేగారు. ఐపీఎల్ రెండో సెంచరీ సాధించారు. సంజు సెంచరీతో చెన్పై 200 పరుగుల మైలు రాయిని సులువుగానే చేరుకుంది. చెన్నై ఇన్నింగ్స్ ధాటిగానే మొదలు పెట్టింది. సంజు, రుతురాజ్ గైక్వాడ్ 3 ఓవర్లలోనే 32 పరుగుల పరుగులు చేసి రుతురాజ్ గైక్వాడ్ 22 పరుగులు చేసి ఔటయ్యారు. సంజు, సర్ఫరాజ్ ఖాన్ లు పవర్ ప్లేను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని 5.4 ఓవర్లలో 72 పరుగులుకు జట్టు స్కోరును చేర్చారు. సర్ఫరాజ్ ఔటైన తరువాత శివం దుబే బ్యాటింగ్ కు వచ్చినా పెద్దగా పరుగులు చేయలేదు 91 పరుగుల వద్ద 3వికెట్ రూపంలో శివం దూబె కూడా వెనుదిరిగారు. బ్రేవిస్ 21 పరుగులు చేయడంతో జట్టు మరోసారి కుదుటపడింది. 11 ఓవర్లో 124 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది.

సంజు కు తోడుగా అప్పుడు కార్తిక్ శర్మ బ్యాటింగ్ కువచ్చి సంజు కు పూర్తి స్థాయిలో సహకారం అందించడంతో సంజు రెచ్చి పోయారు. కార్తిక్ 18 పరుగులు చేసి వెనుదిరిగారు. ఆ తరువాత ఓవర్టన్ తో కలిసి జట్టు స్కోరును సంజు 200 పరుగులు దాటించడంతో శాంసన్ కూడా మరోసారి సెంచరీ చేశారు. 18 వ ఓవర్లో ఓవర్టన్ కూడా వెనుదిరిగారు. ఆ తరువాత అఖిల్ హోసేన్ సంజు తోడయ్యారు. చివరి బంతికి సంజు ఫోర్ కొట్టి 101 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. శాంసన్ 54 బాల్స్ ఎదుర్కొని 10 ఫోర్లు, 6 సిక్స్ లతో 101 పరుగుల చేశారు. సంజు ఓంటరి పోరాటంగో చెన్నై జట్టు 200 పరుగులకు పైగా స్కోరు చేయగలిగింది. ముంబాయి బౌలర్లలో అశ్విన్ కుమార్, గజన్ ఫర్ రెండు వికెట్లు తీసుకున్నారు.

స్పిన్ తో బౌలింగ్ మొదలు పెట్టిన చెన్పై జట్టు ఆశించిన పలితాన్ని తొలి ఓవర్లోనే సాధించింది. 7 పరుగులు సాధించిన తరువాత మొదటి ఓవర్ చివరి బంతికి మాలెవర్ ఔటయ్యరు. రెండో ఓవర్లో కీలక బ్యాట్స్ మెన్ క్వింటన్ డీకాక్ వెనుదిరిగారు. 7 పరుగల స్కోరు వద్దే రెండు వికెట్లు కోల్పోయిన ముంబాయి పీక లోతు కష్టాల్లో పడింది. గత మ్యాచ్ నమన్ ధీర్ తన బ్యాటింగ్ తో ఆకట్టుకోగా ఈ మ్యాచ్ విఫలం అయ్యారు. వచ్చి రాగానే పరుగులేమి చేయకుండానే వెనుదిరిగారు. మలేవర్, నమన్ ధీర్ వికెట్లను హుస్సేన్ తీసుకున్నారు. ఆ తరువాత క్రీజులో ఉన్న సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు చెన్నై బౌలర్లను నిరోధించగలిగారు. భారీ స్కోరు సాధించలంటే భారీగా పరుగులు రాబట్టే ప్రయత్నాలను ముంబాయి జట్టు బ్యాట్సమె న్లు మొదలు పెట్టి మరోసారి క్రమంగా వికెట్లు కోల్పోయారు. 12 ఓవర్లో తిలక్ వర్మ 29 బాల్స్ ఎదుర్కొని 37 పరుగులు చేసి 84 పరుగుల వద్ద హుస్సేన్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యారు. తిలక్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన హర్దిక్ తొలి బంతికే నూర్ అహ్మద్ బౌలింగ్ సునాయస క్యాచ్ ఇచ్చి పరుగులేమి చేయకుండా పెవీలియన్ చేరుకున్నారు. ఆ తరువాతి బంతికే రూథర్ ఫర్డ్ ఔట్ కావడంతో ముంబాయి మ్యాచ్ పై పూర్తిగా ఆశలు వదులుకుంది. సూర్య క్రీజులో ఉన్నా….. రన్ రేట్ పెంచే ప్రయత్నం చేసి స్కోరు 87 పరుగుల వద్ద సూర్య కూడా హుస్సేన్ కు చిక్కారు. దీంతో…. ఎంఐ మరింత కష్టాల్లో పడింది. ఆ తరువాత స్కోరు వంద పరుగులకు చేరుకుంది ఇక్కడ మరో రెండు వికెట్లు ఎం ఐ కోల్పోయింది.దీంతో 19 ఓవర్లలో 104 పరుగులకు అలౌట్ అయింది.







Leave a Reply