
(హైదరాబాద్, న్యూస్ఇన్)
రాష్ట్రంలో రెండు రోజులుగా జరుగుతున్న ఆర్టీసి కార్మికుల సమ్మె ఉద్రిక్తతలకు దారి తీస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గురువారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ సమ్మెపై సానుకూలంగా చర్చించింది.కార్మిక సంఘాలతో శుక్రవారం చర్చలు జరుపుతామని ప్రకటించింది. ఉదయం 10 గంటలకు సచివాలయానికి రావాల్సిన కార్మిక సంఘాల నేతలను ఆహ్వానించింది. ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించడంతో కార్మిక సంఘాల నేతలు ఉదయం సచివాలయానికి చేరుకున్నారు. అమాత్యులు ఎవరూ అక్కడ లేకపోవడంతో వారి సిబ్బందిని సంప్రదించారు. అధికారులతో ముందుగా చర్చలు జరుపాలని సమాధానం రావడంతో కార్మిక సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే చర్చల్లో పాల్గొన్నారు.





Leave a Reply