NewsInn

News in a Click

కొనసాగుతున్న భానుడి ప్ర‌తాపం……..!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

రాష్ట్రంలో వేస‌వి ప్ర‌తాపం కొన‌సాగుతోంది. ప‌లు జిల్లాల‌కు ఆరెంజ్ అలెర్ట్, ఎల్లో అలెర్ట్ ప్ర‌క‌టింఆరు. రాష్ట్రంలోని ప‌లు జిల్లాల్లో 44 డిగ్రీల ఊష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌ని వెద‌ర్ మెన్ హెచ్చ‌రించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు – 44-46°C వ‌ర‌కు ఊష్ణోగ్ర‌త న‌మోద‌య్యే చాన్స్ ఉందని హెచ్చ‌రించారు. ఈ జిల్లాల‌కు రెడ్ అలెర్ట్ ప్ర‌క‌టించారు.కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాల‌ను అరెంజ్ అలెర్ట్ గా హెచ్చ‌రించారు. తేమ వేడి – ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్ – 42° వ‌ర‌కు ఊష్ణోగ్ర‌త‌లున్నా…. 45 డిగ్రీల వ‌ర‌కు అనిపిస్తుంద‌ని తెలిపారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి – భోంగీర్, మహబూబ్ నగర్, నారాయణపేట – 42-43°C – ఎల్లో అలెర్ట్ జోన్ లో ఉంటాయ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *