
(హైదరాబాద్,న్యూస్ఇన్)
స్వీయ జనగణన రాష్ట్రంలో ఆదివారం మొదలు కావడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్వీయ జనగణనలో నమోదు చేసుకున్నారు. స్వీయ జనగణనపై వివరాలను అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. సీఎం స్వయంగా జనగణణలో తన తో పాటు కుటుంబ సభ్యల పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ జనగణనలో అంతా భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి, జీహెచ్ఎంసీ కమిషనర్ RV కర్ణన్, జాయింట్ ప్రిన్సిపల్ సెన్సస్ ఆఫీసర్ ప్రియాంక ఆల, సీహెచ్. ప్రియాంక ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.










Leave a Reply