పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు
(హైదరాబాద్,న్యూస్ ఇన్)
54 వ విజయ్ దివస్ సందర్భంగా… 1971లో ధైర్యం, త్యాగంతో భారత్కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన వీర సైనికులను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్మరించుకున్నారు.
వారి దృఢ సంకల్పం, నిస్వార్థ సేవ దేశాన్ని రక్షించాయని, దేశ చరిత్రలో గర్వించదగిన క్షణాలను లిఖించారని చెప్పారు.ఈ విజయ్ దివస్ వారి పరాక్రమానికి వందనమర్పించేదిగా, వారి అసమాన స్ఫూర్తికి చిహ్నంగా నిలుస్తుందని తెలిపారు. సైనికుల వీరత్వం తరాల పాటు భారతీయులకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని చెప్పారు.విజయ్ దివస్ను పురస్కరించుకుని మంగళవారం చారిత్రక గోల్కొండ కోటలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

1971 యుద్ధంలో భారత సాయుధ దళాలు కేవలం 13 రోజుల్లోనే చారిత్రక విజయం సాధించాయని, 93 వేల మంది పాకిస్థాన్ సైనికులు లొంగిపోవడంతో బంగ్లాదేశ్ అవతరించిందని మంత్రి గుర్తు చేశారు.ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రస్తావించిన మంత్రి, భారత్ శాంతిని కోరుకుంటూనే జాతీయ భద్రతకు ముప్పు వస్తే గట్టిగా ప్రతిస్పందిస్తుందనే స్పష్టమైన సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చిందన్నారు.






Leave a Reply