NewsInn

News in a Click

అసెంబ్లీ- పార్ల‌మెంట్ ను త‌ల‌పించాలి – సీఎం

అసెంబ్లీ- పార్ల‌మెంట్ ను త‌ల‌పించాలి – సీఎం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

అసెంబ్లీ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనుల పై సీఎం రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ల స‌మక్షంలో అసెంబ్లీ, మండ‌లిలో చేయాల్సిన ప‌నులను తెలిపారు. పార్ల‌మెంట్ త‌ర‌హాలో అసెంబ్లీ ప్రాంగ‌ణాన్ని తీర్చిదిద్దాల‌ని సూచించారు. స‌భా గౌర‌వం పెరిగేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. ఉభ‌య స‌భ‌ల స‌భ్యుల‌కు ప్రైవ‌సీ ఉండాల‌ని, ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు అందుకు అనుగుణంగా లేవ‌న్న అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి వ్య‌క్తం చేశారు.

ప‌బ్లిక్ గార్డెన్ లో స‌భ్యుల కోసం క్ల‌బ్ ఏర్పాటు చేయాల‌న్నారు. స‌భ్యుల కోసం వాకింగ్ ట్రాక్, క్రీడా ల‌పై ఆస‌క్తి ఉన్న వారికి క్రీడా సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని చెప్పారు. వ‌చ్చే సెష‌న్ నాటికి పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్ మాదిరిగా అసెంబ్లీకి సెంట్ర‌ల్ హాల్ ను సిద్ధం చేయాల‌న్నారు. అయితే హెరిటేజ్ క‌ట్ట‌డాల‌కు ఏమాత్రం న‌ష్టం జ‌రుగ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. అసెంబ్లీకి ప్ర‌స్తుతం క‌ల్పిస్తున్న భ‌ద్ర‌తా ప్ర‌మాణాను మ‌రింత ప‌టిష్టం చేయాల‌ని సూచించారు. వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల నాటికి కీల‌క నిర్ణ‌యాల‌ను అమ‌లు చేయాల‌ని అధికారుల‌ను అదేశించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *