NewsInn

News in a Click

క‌మ‌ర్షియ‌ల్ గ్యాస్ ధ‌ర భారీగా పెంపు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఇరాన్ యుద్ధ ప్ర‌భావంతో ఇప్ప‌టికే పెట్రో ఉత్ప‌త్తుల ధ‌ర‌లు భారీగా కేంద్ర ప్ర‌భుత్వం పెంచుతుంద‌న్న అనుమానాలు గ‌త కొన్ని రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. అయితే తొలి విడ‌త‌లో మాత్రం వాణిజ్య సిలిండ‌ర్ ధ‌ర పెంపుకు మాత్ర‌మే కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. 19 కిలోల గ్యాస్ సిలిండ‌ర్ పై దాదాపు వెయ్యి రూపాయ‌లు రూ.993 పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ఇది నేరుగా సామాన్య ప్ర‌జ‌ల‌పై ఎలాంటి భారం ప‌డ‌కపోయినా…..హోట‌ళ్ల‌లో పెరిగిన గ్యాస్ ధ‌ర‌లు, బ్లాక్ మార్కెట్ లో సిలిండ‌ర్ కొనుగోళ్ల ప్ర‌భావం కార‌ణంఆ య‌జ‌మానులు భారీగా ధ‌ర‌లు పెంచారు. ఒక్క చాయ్ న‌గ‌రంలో గ‌తంలో చాయ్ బండిపై రూ.10 ఉంటే రూ.12కు గ‌త నెల రోజుల క్రితమే పెంచ‌డం జ‌రిగింది. హోట‌ల్ స్థాయి ని ఈ పెంచేశారు. టిఫిన్ ధ‌ర‌లు క‌నీసం 5 రూపాయ‌ల నుంచి పెంచారు.భోజ‌నం ద‌ర‌లు కూడా అన్ని హోట‌ళ్ల‌లో భారీ పెంచారు. గ‌తంలో ఒక భోజనం రూ.150 కి అమ్మెవారు….. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అదే హోటల్ భోజనం ధ‌ర రూ.30 పెంచి 180 కి విక్ర‌యించ‌డంతో పాటు…. మెను లోని కొన్ని ఆహార ప‌దార్థాల‌ను తొంల‌గించారు. గ్యాస్ కొరత కార‌ణంగానే ధ‌ర‌లు పెంచిన‌ట్లు హోటల్ య‌జ‌మానులు చెబుతున్నారు. అయితే ఇదంతా వినియోగ‌దారులపై ప‌రోక్షంగా ప‌డుతున్న భారంగానే ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది. తాజా ధ‌ర‌ల పెంపుతో మ‌రింత ధ‌ర‌లు పెంచేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. సామాన్యుల‌పై భారం ప‌డ‌క‌పోయినా జేబుకు చిల్లులు పెడుతోంది.పెంచిన ధరలతో హైదరాబాద్‌లో రూ.3,069కు చేరిన కమర్షియల్ సిలిండర్ ధర. చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *