(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
రాజస్థాన్ రాయల్స్ ఆరంభంలో తడబడ్డా ఢిల్లీ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో విజయవంతం అయింది. కెప్టన్ రియన్ పరాగా ఎట్టకేలకు ఫాంలోకి వచ్చారు. ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని పరాగ్ ఈ మ్యాచ్ లో రాణించారు.20 నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 22 లక్ష్యాన్ని226 ఢిల్లీ క్యాపిటల్స్ ముందు ఉంచింది.
ఈ సీజన్ లోనే మంచి ఓపెనింగ్ జోడిగా గుర్తింపు పొందిన యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్య వంశీలు ఈ మ్యాచ్ లో వెంట వెంటనే ఔటయ్యారు. తొలి బంతికి సిక్స్ కొట్టి జైస్వాల్ మూడో బంతికి ఔటయ్యారు. ఛోటా భీం వైభవ్ సూర్య వంశీ కూడా ఒక ఫోర్ కొట్టి ఆ తరువాతి బంతికే బౌల్డ్ అయ్యారు. దీంతో 2 ఓవర్లలోపే కేవలం 12 పరుగులు మాత్రమే చేసి రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో బ్యాటింగ్ వచ్చిన రియాన్ పరాగ్, ధృవ్ జురేల్ లు జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లే బాద్యతను తీసుకున్నారు.

వీరి భాగస్వామ్యంతో ఆర్ ఆర్ జట్టు భారీ స్కోరు దిశగా అడుగులు వేసింది. 12 వ ఓవర్లో ధృవ్ జురేల్ 42 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఆ తరువాత పరాగ్ కు రవీంద్ర జడేజా జోడిగా వచ్చారు. వీరి భాగస్వామ్యం కూడా జట్టుకు కలిసి వచ్చింది. జడేజా 20 పరుగులే చేసినా…పరాగ్ పరుగులు చేసేందుకు సహకరించారు.16.2 ఓవర్ వద్ద 167 పరుగుల స్కోరు వద్ద జడేజా ఔటయ్యారు. మరొక్క బంతి గ్యాప్ లోనే రియాన్ పరాగ్ 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్ లతో 90 పరుగులు చేసి సెంచరీకి పది పరుగుల దూరంలో ఐంటయ్యారు. ఆ తరువాత ఫెరీరా బ్యాటింగ్ కు రావడంతో ఆర్ ఆర్ స్కోరు గేరు పూర్తిగా మారిపోయింది. ఫెరీరా కేవలం 14 బంతులను మాత్రమే ఎదుర్కొని 47 పరుగులు సాధించారు. చివరి 5ఓవర్లలో 78 పరుగులు సాధించి ఆర్ ఆర్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చి వేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచిల్ స్టార్క్ రాణించి 3 వికెట్లు తీసుకున్నారు. జెమిసన్, అక్షర్ పటేల్, నటరాజన్ లు ఒక్కో వికెట్ తీసుకున్నారు.







Leave a Reply