NewsInn

News in a Click

TRS క‌విత‌పై పాల్ షాకింగ్ ఆరోప‌ణ‌లు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

క‌ల్వ‌కుంట్ల క‌విత కొత్త పార్టీ ఏర్పాటు చేయ‌డంపై ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అమెరికా నుంచి వీడియో విడుద‌ల చేశారు. తాను ఇరాన్- అమెరికా యుద్ధం ఆపే ప‌నిలో బీజీ గా ఉన్నా….. క‌విత పార్టీపై స్పందించాల్సిన అవ‌స‌రం ఉన్న నేప‌థ్యంలో తాను వీడియో చేస్తున్న‌ట్లు చెప్పారు. క‌ల్ల‌కుంట్ల క‌విత గురించి 2008లో కేసీఆర్ త‌న‌కు చెప్పార‌న్నారు. క‌విత పార్టీతో ఎవ‌రికీ ఉప‌యోగం లేద‌న్నారు. ఆస్తుల పంచాయ‌తీలో భాగంగానే ఆమె కొత్త‌గా పార్టీ ప్రారంభించార‌న్నారు. క‌విత‌తో పార్టీ ఎవ‌రు పెట్టించారో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే అన్నారు. 2008లో త‌న‌ను క‌విత 15 కోట్ల రుపాయాలు అడిగింద‌ని ఈ విష‌యాన్ని కేసీఆర్ ను క‌లిసి క‌విత కు డ‌బ్బులు ఇవ్వ‌మంటారా అని అడిగాన‌ని అయితే కేసీఆర్ క‌విత‌ను న‌మ్మ వద్ద‌ని త‌న‌కు చెప్పార‌ని పాల్ వెల్ల‌డించారు. యుధ్దాని ఆపిన త‌రువాత వ‌చ్చి అన్ని విష‌యాలు మాట్లాడుతాన‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *