NewsInn

News in a Click

సోమ‌వార‌మే ఐదు రాష్ట్రాల ఫ‌లితాలు

సోమ‌వార‌మే ఐదు రాష్ట్రాల ఫ‌లితాలు

(న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌)

ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు సోమ‌వారం వెల్ల‌డి కానున్నాయి. త‌మిళ‌నాడు, పుదుచ్చేరి, కేర‌ళ‌తో పాటు అస్సాం, ప‌శ్చిమ బంగా ఓట్ల లెక్కింపు రేపు జ‌రుగ‌నుంది. ఇప్ప‌టికే ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డి కావ‌డంతో ఆయా రాష్ట్ఆర‌ల ఫ‌లితాల‌పై ఒక్కో ర‌కంగా ప్ర‌జాభిప్రాయం వ‌చ్చింది. ప్ర‌ధానంగా ఐదు రాష్ట్రాల ఫ‌లితాల్లో పెద్ద రాష్ట్రాలుగా ఉన్న త‌మిళ‌నాడు, ప‌శ్చిమ బంగా ఫ‌లితాలు మాత్రం అంద‌రిలోనూ ఆస‌క్తి రేపుతున్నాయి. త‌మిళ‌నాడుపై డీఎంకే మూడో సారి ఆశ‌లు పెంచుకోగా టీవీకే అనూహ్యంగా పుంజుకుంద‌న్న స‌ర్వేలు ఆస‌క్తి రేపుతున్నాయి. టీవీకే ప్ర‌భావం త‌క్కువ‌గానే ఉంటుందుని ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు అంచ‌నా వేస్తున్న ఎన్నిక‌ల విశ్లేష‌కులు టీవీకే బ‌లం పంజుకుంద‌ని చెప్ప‌డంతో టీవికే అధినేత ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంపై దృష్టి పెట్టారు. పోటీ చేసిన అభ్య‌ర్థులంతా మ‌హాబ‌లిపురం లోని ఓ రిసార్ట్ కు రావాల‌ని ఆదేశాలు పార్టీ ఇచ్చింది. డీఎంకే, ఏ ఐ ఏ డీఎంకే మధ్య పోరు కాస్త త్రిముఖ పోరుగా మార‌డం, ఏఐఏడిఎంకే ఓటు బ్యాంకును టీవికే దెబ్బ తీసింద‌న్న సంకేతాలు వెలువ‌డ‌డంతో టీవీకే అధినేత విజ‌య్ అప్ర‌మ‌త్తం అయ్యారు. ప‌లితాలు ఏకప‌క్షం రాక‌పోతే టీవీకే పార్టీ కీల‌కంగా మారుతుంద‌ని పార్టీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. దీంతో త‌మిళ‌నాడులో రిసార్ట్ రాజ‌కీయం మొద‌లైంది.

ఇక మరో పెద్ద రాష్ట్రంపై బీజేపీ భారీగా ఆశ‌లు పెంచుకుంది. మ‌మ‌తా బెన‌ర్జీ వ‌రుస‌గా మూడు సార్లు ముఖ్య‌మంత్రి గా ఉండ‌డం, బెంగాల్ లో జ‌రిగిన ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో తృణ‌మూల్ కాంగ్రెస్ పై భారీ వ్య‌తిరేక‌త ఉంద‌ని, ఈ సారి ఖ‌చ్చితంగా క‌మ‌ల వికాసం జ‌రుగుతుంద‌ని బీజేపీ అంచానా వేస్తోంది. ఇత‌ర రాజ‌కీయ పార్టీల ప్ర‌భావం ప‌శ్చిమ బంగాలో త‌గ్గి పోవ‌డంతో బీజేపీ భారీ ఆశ‌ల‌తో ఎన్నిక‌ల‌ను ఎదుర్కొంది. ఎగ్జిట్ ఫ‌లితాలు కూడా బీజేపీ అనుకూలంగా రావ‌డంతో బీజేపీ నేత‌లు ఈ సారి బంగాల్ లో పాగా వేయ‌డం ఖాయ‌మ‌న్న ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. అయితే మ‌మతా బెన‌ర్జీ కూడా 220 సీట్లు సాధించి మ‌రోసారి టీఎంసీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, ఎగ్జిట్ పోల్స్ స‌ర్వేల‌న్నీ త‌ప్పే అని మ‌మతా బెన‌ర్జీ దీమా వ్య‌క్తం చేసింది.

అస్సాంలో బీజేపీ మ‌రోసారి స్ప‌ష్ట‌మైన మెజార్టీతో అధికారాన్ని ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ మిత్ర ప‌క్షాల‌కు అవ‌కాశం ఉంద‌ని ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా వేశాయి, పుదుచ్చేరిలో ప్ర‌స్తుత సీఎం ఎన్. రంగ‌స్వామి ఆధ్వ‌ర్యంలోని ఎన్. ఆర్. కాంగ్రెస్,బీజేపీ, ఏఐఏడిఎంకే పార్టీలు మిత్ర ప‌క్షంగా పోటీ చేశాయి. ఇక్డ 16 నుంచ 25 స్థానాలు ఈ కూట‌మి ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌ని, కాంగ్రెస్ కూట‌మికి 4 నుంచి 12 స్థానాల‌కే ప‌రిమితం కావ‌చ్చ‌ని అంచ‌నా. కేర‌ళ‌లో ఎల్ డీ ఎఫ్, యూడిఎఫ్ కూట‌మి పార్టీలు నువ్వా నేనా అన్న‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ కు స్వ‌ల్ప ఆధిక్య‌త ద‌క్క‌వ‌చ్చని స‌ర్వే సంస్థ‌లు అంచ‌నా వేస్తున్నాయి. అయితే యూడీఎఫ్ కూడా ధీటుగా పోటీ ఇస్తుంద‌ని అంచ‌నా… అయితే కేర‌ళ ఎన్నిక‌ల ట్రెండ్ అంచ‌నా వేస్తున్న వారు మాత్రం ఈ సారి యూడీఎఫ్ అధికారం ద‌క్కించుకునే అవ‌కాశాలున్నాయ‌ని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *