NewsInn

News in a Click

త‌మిళ‌నాడు సీఎం ఓట‌మి

(న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌)

ద‌క్షిణాది రాష్ట్రాల్లో ముఖ్య‌మంత్రి హోదాలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓట‌మి స్టాలిన్ ఓటమి పాలైయ్యారు. పుదుచ్చేరిలో మాత్రం ఎన్ .ఆర్ కాంగ్రెస్ అధ్య‌క్షులుర ఎన్. రంగ‌స్వామి విజ‌యం సాధించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ సీఎం ఓట‌మి రాజ‌కీయంగా తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది. ఎంకే స్టాలిన్ చెన్నై న‌గ‌రంలోని కొల‌త్తూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేశారు. 2011 నుంచి ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా విజ‌యం సాధిస్తూ వ‌చ్చిన స్టాలిన్ ఈ ఎన్నిక‌ల్లో టీవీకే ప్ర‌భ‌జ‌నంలో ఓట‌మి ఎదుర్కొక త‌ప్ప‌లేదు. స్టాలిన్ పై టీవీకే పై వి.ఎస్ బాబు దాదాపు 8 వేల ఓట్ల‌తో విజ‌యం సాధించారు. గ‌త ఎన్నిక‌ల్లో స్టాలిన్ ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 70 వేల ఓట్ల‌కు పైగా మెజార్టీతో గెలుపొందారు. .మూడు సార్లు ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన స్టాలిన్ నాలుగోసారి వి ఎస్ బాబు చేతిలో 8వేల ఓట్ల తేడాతో ఓట‌మి చెందారు.

కేర‌ళ‌లో రెండు సార్లు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎల్డీఫ్ కూడా ఈ సారి ఓట‌మి చెందింది. సీనియ‌ర్ నేత పిన‌ర‌య్ విజ‌య‌న్ క‌న్నూరు జిల్లాలోని ధ‌ర్మ‌దం నియోజ‌వ‌ర్గం నుంచి పోటీ చేసి విజయం దక్కించుకున్నారు.

ముగ్గురు సీఎంల వెనుకంజ‌…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *