
(హైదరాబాద్,న్యూస్ఇన్)
ఇరాన్- ఆమెరికా యుద్ధం ఆపే పనిలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కే.ఏ పాల్ బిజీగా ఉన్నారు. అయినా దేశంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై వీడియోలు విడుదల చేస్తున్నారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ దళపతి విజయం సాధించడం తో అభినందనలు తెలిపారు. అన్ని ఎగ్జిట్ పోల్సో, సర్వే పలితాలు ఏ ఒక్కటి సరిగ్గా ఇవ్వలేకపోయాయని నేను మాత్రం విజయ్ గెలుస్తారని అంచనా వేశానన్నారు. తమిళనాడు సీఎంగా ఉన్న స్టాలిన్ ను 3 ఏళ్ల క్రితం 90 నిమిషాలు మాట్లాడి తన పీస్ మిషన్ గురించి మాట్లాడామని, అందుకు అనుగుణంగా మేము దరఖాస్తు చేసుకున్నా అనుమతులు స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ లు అనుమతులు ఇచ్చేందకు నిరాకరిస్తున్నారని పాల్ దినకరన్ ద్వారా తెలుసుకున్నాన్నారు. మేము కోర్టుకు వెళుతామని చెన్నై ప్రెస్ క్లబ్ లో మీడియా తో మాట్లాడిన తరువాత ఒక్క రోజులోనే అనుమతులు వచ్చాయన్నారు. ఆ తరువాత తమిళ రాజకీయ పరిస్థితులను అంచనా వేసి స్టాలిన్ మాజీ ముఖ్యమంత్రిగా మారడం ఖాయమని చెప్పినట్లు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అదే దారిలో వెళుతున్నారని చెప్పారు. మా పీస్ మిషన్ కు ఎవరు సహకరించకపోయినా…ఆ రాజకీయ పార్టీలకు మద్దతు ఉండదని చెప్పారు. తమిళ నాడు ఎన్నికల్లో భారీ విజయాన్ని దక్కించుకున్న విజయ్ కు ఎన్నికల ప్రచారం కోసం 150 నుంచి 200 కోట్ల రుపాయాలు ఇస్తా అని నేను అడిగాను…విజయ్ దాన్ని సున్నితంగా తిరస్కరించి ఆశీస్సులు కోరారని పాల్ వెల్లడించారు.










Leave a Reply