
(హైదరాబాద్,న్యూస్ఇన్)
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం దసరా పండుగ లోపు మొదలు పెట్టకపోతే పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో పాదయాత్ర చేస్తానని టీఆర్ ఎస్ అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. లక్ష్మిదేవిపల్లి లో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వ హాయంలో సాగునీటి ప్రాజెక్టులకు కోసం భారీగా నిదులు వెచ్చించామని చెబుతున్నా సాగునీరు మాంత్రం అంద లేదన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు 33 వేల కోట్ల రుపాయాలు వెచ్చించి కొత్తగా 33 ఎకరాలకు గత బీఆర్ ఎస్ సర్కార్ నీటిని అందించలేదని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయానికి గురైన పాలమూరుకు బీఆర్ ఎస్ ప్రభుత్వం భేషజాలతో అన్యాయం చేసిందని ఆరోపించారు. జూరాల సోర్స్ పాయింట్ ను శ్రీశైలంకు మార్చడం పెద్ద తప్పిదమన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పంచాయతీ పెట్టుకోవాల్సి వస్తుందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పునే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని కవిత ఆరోపించారు. నల్లమల్ల పులిబిడ్డ అని చెప్పుకునే సీఎం ఇప్పటి వరకు ఒక్క తట్టెడు మన్ను పాలమూరు పథకంలో తీయలేదన్నారు.








Leave a Reply