NewsInn

News in a Click

ఆటోలో ఇద్ద‌రు యువ‌కుల డెడ్ బాడీలు

పాత‌బ‌స్తీలో క‌ల‌క‌లం

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

నిలిచి ఉన్న ఆటోలో రెండు డెడ్ బాడీలు క‌నిపించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. న‌గ‌రంలోని చాంద్రాయ‌ణ్ గుట్ట
పోలీస్ స్టేషన్ పరిధిలోని రోమన్ హోటల్ ఎదురుగా ఉన్న ప్యాసింజర్ ఆటోలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మృతి చెందిన వారిని జ‌హాంగీర్ (24) మరియు ఇర్ఫాన్ (25) అనే ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు….సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు… మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుండగా మూడు ఇంజెక్షన్ లు సిరెంజీలు లభ్యం అయ్యాయి దీనిని బట్టే ముగ్గురు ఉన్నట్లు పోలీసులు అంచ‌నా వేస్తున్నారు. ముగ్గురిలో మ‌రో యువ‌కుడు ప‌రారైన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అధిక మోతాద‌రులో మ‌త్తు తీసుకోవ‌డ‌మే మృతి కార‌ణ‌మ‌ని పోలీసులు ప్రాథ‌మికంగా అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు…..ఈ ప్రాంతంలోని సీసీ పుటేజీల‌ను పోలీసులు క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు. ప‌రారైనా మూడో యువకుడు ప‌ట్టుబ‌డితే మృతికి కార‌ణాలపై స్ప‌ష్ట‌త రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *