NewsInn

News in a Click

ద‌ళ‌ప‌తి ప్ర‌మాణ స్వీకారానికి లైన్ క్లియ‌ర్

ద‌ళ‌ప‌తి ప్ర‌మాణ స్వీకారానికి లైన్ క్లియ‌ర్

( చెన్నై,న్యూస్ఇన్‌)

ఉత్కంఠ రేపిన త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారానికి ఎట్ట‌కేల‌కు లైన్ క్లియ‌ర్ అయింది. టీవీకే సంపూర్ణ మెజార్టీ సాధించ‌క‌పోవ‌డం,ఆ పార్టీ నేత‌ల అనుభ‌వ రాహిత్యం త‌దిత‌ర అంశాలు విజ‌య్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తీవ్ర అడ్డంకులు ఎదుర‌య్యాయి. అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించిన టీవీకే కాంగ్రెస్ తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని గ‌వ‌ర్న‌ర్ ను ముందుగా క‌లిసింది. అయినా మెజార్టీ రాక‌పోవ‌డంతో గ‌వ‌ర్న‌ర్ త‌న అధికారాల‌తో సంపూర్ణ మెజార్టీ తో స‌భ్యుల జాబితాను స‌మ‌ర్పిస్తేనే కొత్త స‌ర్కార్ కొలువు దీరేందుకు అవ‌కాశం ఇస్తాన‌ని తేల్చి చెప్పారు. ఈ నేప‌థ్యంలో గ‌త నాలుగు రోజులుగా ఎన్నో స‌మీక‌ర‌ణ‌లు తెర‌పైకి వ‌చ్చాయి.

త‌మిళ‌నాడులో వేళ్లూనుకుపోయిన రాజ‌కీయ బ‌ధ్ద శ‌తృవులు ఒక్క‌ట‌వుతున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగింది. పార్టీలు త‌మ ఎమ్మెల్యేల‌ను కాపాడుకునేందుకు శిబిరాల‌ను నిర్వ‌హించాయి. కానీ టీవీకే పార్టీ కాంగ్రెస్ పార్టీతో క‌లువ‌డం రాజ‌కీయంగా ఇత‌ర పార్టీలతో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు కాంగ్రెస్ అనుభ‌వం క‌లిసి వ‌చ్చింది. వామ‌ప‌క్ష పార్టీల‌తో పాటు టీవీసీ,ఐయూఎంఎల్ మ‌ద్ద‌తును వ్యూహాత్మ‌కంగా విజ‌య్ ద‌క్కించుకున్నారు. దీంతో ఆయా రాజ‌కీయ పార్టీలు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు లేఖలు టీవీకే ఇచ్చాయి. 108 స్థానాల్లో టీవీకే విజ‌యం సాధించినా టీవీకే అధినేత విజ‌య్ రెండు స్థానాల్లో గెలుపొందారు. దీంతో ఒకే స్థానం కింద దాన్ని ప‌రిగ‌ణించాల్సి వ‌స్తోంది.

ఈ కార‌ణంగా టీవీకే బ‌లం 107కే ప‌రిమితం అయిన‌ట్లు అయింది. కాంగ్రెస్ 5, సీపీఐ, సీపీఎం 4, టీవీసి 2, స్థానాల్లో విజ‌యం సాధించ‌డంతో ఆయా పార్టీల మ‌ద్ద‌తు కూడ గ‌ట్టేందుకు విజ‌య్ పార్టీకి ఐదు రోజుల స‌మ‌యం ప‌ట్టింది. విజ‌య్ కు విప‌క్షాలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంతో మిత్ర ప‌క్షాల‌తో క‌లిసి 120 మంది స‌భ్యులు టీవీకేకు మ‌ద్ద‌తు తెలిపిన‌ట్లు అయింది. ఈ ప‌రిస్థితుల్లో ఏఐ ఏడిఎంకే లో కూడా చీలిక వ‌స్తుంద‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఆ పార్టీకి చెందిన స‌గానికి పైగా ఎమ్మెల్యేలు టీవీకే లో చేరుతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఐదు రోజుల్లో నాలుగు సార్లు గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి విజయ్ ఎట్ట‌కేల‌కు ప్ర‌భుత్వం ఏర్పాటుకు ఆహ్వానాన్ని అందుకున్నారు.

ఈ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర విశ్వ‌నాథ్ ఆర్లేక‌ర్ వ్య‌వ‌మ‌రించిన తీరు కూడా వివాదాస్ప‌దంగా మారింది. ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌న్నీ త‌మిళ నాడులో గ‌వ‌ర్న‌ర్ అనుస‌రించిన విధానాన్ని త‌ప్పుబ‌ట్టారు. బీజేపీ జాతీయ నేత‌ల ఆదేశాల‌కు అనుగుణంగా గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు ప్ర‌మాణ స్వీకారం ఉంటుంద‌ని లోక్ భ‌వ‌న్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. విజ‌య్ ముఖ్య‌మంత్రిగా చెన్నై లోని జ‌వ‌హ‌ర్ లాల్ నెహృ స్టేడియంలో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *