(చెన్నై,న్యూస్ఇన్)
ఉత్కంఠ లేపిన తమిళ రాజకీయాలకు పులిస్టాప్ పడింది. ఐదు రోజుల క్రితం ఫలితాలు వచ్చినా….ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగింది. సంపూర్ణ మెజార్టీ టీవీకే సాధించకపోవడంతో… ఇతర పార్టీల మద్దతు కూడ గట్టడంలో ఎన్నో ట్విస్ట్ లు తెరపైకి వచ్చాయి. ఎమ్మెల్యేల మెజార్టీ జాబితాను పరిశీలించిన గవర్నర్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో…. ఆదివారం ఉదయం సీఎం గా జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు తొమ్మిది మందిని మంత్రులుగా అవకాశం కల్పించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్, మహిళలకు భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధన్యత ఇస్తుందన్నారు. ఈ పథకాలను అమలు చేస్తూ సంతకాలు చేశారు. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహూల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.










Leave a Reply