NewsInn

News in a Click

కారు ను ఢీ కొన్న బైక్ – 5 గురు మృతి

కారు ను ఢీ కొన్న బైక్ –  5 గురు మృతి

(పాల‌మూరు,న్యూస్ఇన్‌)

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ స‌మీపంలోని పాల్గొండ ద‌గ్గ‌ర ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బైపాస్ రోడ్డులో బైక్ రేసింగ్ చేస్తున్న రేజ‌ర్లు అతి వేగంతో కారును ఢీకొన‌డంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం ఐదుగురు మృతి చెందారు. స్పోర్ట్స్ బైక్ తో రేసింగ్ లు నిర్వ‌హించే ప్రాంతంలో యూ ట‌ర్న్ తీసుకుంటున్న కారును అతి వేగంగా బైక‌ర్ ఢీ కొట్టారు. బైక్ పై ఉన్న ఇద్ద‌రు స‌హా కారులోని ముగ్గురు స్పాట్ లోనే మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా విషాదం నింపింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన అర్షియ బేగం(30), ఉజేప(7), అమర్(2) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బైక్‌పై ఉన్న హైదరాబాద్‌కు చెందిన యాకుబ్ అఫ్జల్(25)తో పాటు మరో వ్యక్తి కూడా మృతి చెందారు.

బైక్ తో కారును ఢీకొంటే కారులో ఉన్న వారి ప్రాణాలు పోయాయంటే బైక్ స్పీడ్ ఎంత ఉందో అంచ‌నా వేయ‌చ్చ‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. బైక్ ఢీ కొట్టిన ప్ర‌మాదంలో కారు ఒక భాగం పూర్తిగా ద‌గ్ధం కావ‌డం బైక‌ర్ ఎంత స్పీడ్ లో ఉన్నారన్న‌ది తెలుసుకోవ‌చ్చు.రోజు రాత్రి పూట బైపాస్ రోడ్డుపై బైక్ రేజింగ్ లు జ‌రుగుతున్నా పోలీసులు ప‌ట్టించుకోక‌పోవ‌డంతోనే ఇలాంటి ఘ‌ట‌న‌లు త‌ర‌చూ జ‌రుగుతున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ప్ర‌మాదంలో మృతుల సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌డంతో ఇది బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని, త‌ర‌చూ ప్ర‌మాదాలు జ‌రుగుతూ ఎంతో మంది బైపాస్ రోడ్లో గాయాల‌పాల‌వుతున్నార‌ని స్థానికులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *