
(హైదరాబాద్,న్యూస్ఇన్)
వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కనిపించిన చల్లదనం పోనుంది. ఇక రెండు రోజుల్లో భారీగా ఊష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 13వ తేదీ నుంచి క్రమంగా భానుడి భగభగలు పెరుగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఊష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉందని అంచనా. హైదరాబాద్ లోనే 45 నుంచి 46 డిగ్రీల వరకు ఊష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా…రాష్ట్రంలో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేడు, రేపు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, అది వేడి నుంచి పెద్దగా ఉపశమనాన్ని ఇవ్వకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.ఈ నెల 18 నుండి 22వ తేదీల మధ్య ఎండలు గరిష్ట స్థాయికి చేరుతాయని, ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. సుమారు 10 రోజుల పాటు వడగాల్పులు తీవ్రంగా వీచే అవకాశం ఉన్నందున, ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.











Leave a Reply