NewsInn

News in a Click

బండి భగీరథ్ పై కేసు – స్పందించిన సీఎం

బండి భగీరథ్ పై కేసు – స్పందించిన సీఎం

( హైదరాబాద్,న్యూస్ ఇన్)

కేంద్ర మంత్రి బండి భగీరథ పై నమోదైన పోస్కో కేసు విచారణను వెంటనే మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్ ను ఆదేశించారు.8 వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి వివరించారు.ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని ముఖ్యమంత్రి కి డీజీపీ వివరించారు.
కేసు స‌మ‌గ్ర‌ విచారణ కోసం ప్రత్యేక టీం లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీ ని ఆదేశించారు.

Bandi sanjay with his Son

స్పందించిన బాలల హక్కుల కమిషన్…

పేట్ బ‌షీరాబాద్ పోలీస్ స్టేష‌న్ లో బండి భ‌గీర‌థ్ మీద‌ న‌మోదైన ఫోక్సో కేసు పైన తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (TSCPCR) చైర్‌పర్సన్‌ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి స్పందించారు. న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ నుంచి వివ‌రాలు తెప్పించుకుని విచార‌ణ కోసం ప్ర‌త్యేక బెంచ్ ఏర్పాటు చేశారు.

బండి భగీరథ పై కేసు ఎందుకు నమోదయిందో తెలుసా…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *