(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణా రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. బండి భగీరథ పోక్సో కేసుపై పార్టీల అభిప్రాయాలు రాజకీయంగా ఈ కేసును మరింత హాట్ హాట్ గా మారుస్తున్నాయి.పార్టీల నేతలు వేదికలపై చేసే విమర్శలు ఎలా ఉన్నా..ఎవరు ఎవరితో కుమ్మక్కు అనే చర్చ జరుగుతూనే ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటని బీజేపీ, బీజేపీ, బీఆర్ ఎస్ ఒకటే అని కాంగ్రెస్, బీజేపీ, కాంగ్రెస్ లు ఒక్కటని బీఆర్ఎస్ లు విమర్శలు గుప్పించుకుంటాయి. ఈ నేపథ్యంలో భగీరథపై నమోదైన కేసు కొత్త చర్చకు దారి తీస్తోంది.బండి సంజయ్ తనయుడిపై పోక్సో కేసు నమోదు కావడం రాజకీయ నేతల అభిప్రాయాలు ఒక్కో విధంగా ఉంటుండం ఆసక్తి కర చర్చలకు దారి తీస్తున్నాయి. ఒ క్కో పార్టీ ఒక్కోలా స్పందిస్తుండడం కొత్త చర్చకు తెరలేపుతోంది. బండి సాయి భగీరథ మైనర్ బాలిక తో వ్యవహరించిన తీరు తో ఆ బాలిక పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన నాటి నుంచి ఆసక్తి కర వ్యాఖ్యలు నేతలు చేస్తున్నారు. చట్టం తన పని తాను చేస్తుందని ఒకరు…. చట్టం బండి సంజయ్ కు చుట్టంగా మారిందని మరొక పార్టీ ఆరోపణ చేస్తోంది. ఇక సోషల్ మీడియా గురించి ఆసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఓ రాజకీయ పార్టీ సోషల్ మీడియా భగీరథ్ ను సమర్ధిస్తూ బాలికదే అంతా తప్పు అన్న చందంగా …మరో రాజకీయ పార్టీ సోషల్ మీడియా భగీరథ్ తప్పు అన్న చందంగా డ్రైవ్ లు చేస్తున్నాయి. ఈ విషయం గురించి పెద్దగా చర్చ చేయాల్సిన అవసరం లేదు… కానీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వారి రాజకీయ అనుబంధం గురించి తేట తెల్లం చేస్తున్నాయి. కేంద్ర మంత్రి కావడంతోనో….క్యాడర్ లో బలమైన నాయకుడుగా గుర్తింపు ఉన్న నేతగా ఉండడంతోనో…బీజేపీ పెద్దలతో అత్యంత సన్నిహితంగా ఉంటారన్న గుర్తింపుతో నేతల అభిప్రాయాలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి

బీఆర్ఎస్ హాయంలో ఏం జరిగింది…..
ఎఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పోక్సో కేసుపై స్పందించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు.కానీ…బీఆర్ ఎస్ హాయంలో జరిగిన కేసును ప్రస్తావించారు. మాజీ హోమంత్రి మహ్మూద్ అలీ తనయుడితో పాటు, ఓ కార్పోరేషన్ చైర్మన్ కుమారుడిపై నమోదైన జూబ్లీ హిల్స్ కేసులో అప్పడు బీఆర్ఎస్ సర్కార్ అనుసరించిన విధానాన్ని తప్పుబట్టారు. దాన్ని విస్మరించి బండి సంజయ్ తనయుడిపై చేస్తున్న ప్రచారం ఎంత వరకు సమంజమని ప్రశ్నించారు.
పెళ్లి చేయాలన్న పొన్నం…..
ఇక కాంగ్రెస్ పార్టీలో మంత్రి పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ పై ఘాటుగా స్పందించారు. ఇద్దరి సామాజిక వర్గాలు ఒకటే అని పెద్దలు చర్చలు జరిపి పెళ్లి చేస్తే సరిపోతుందన్న సూచన చేశారు. దీన్ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఖండించారు. పొన్నం ప్రభాకర్ వ్యక్తి గత అభిప్రాయం అని తేల్చి చెప్పారు. అయితే ప్రభుత్వ పరంగా కేసు విచారణ జరగుతోందని, విచారణ తరువాతే స్పష్టత వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పోరాటం…..
ఇక బీఆర్ఎస్ ఈ ఆపరేషన్ ను పోలీసు శాఖ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు అప్పగించింది. ఆర్ ప్రవీణ్ నిత్యం ఈకేసుపై కొత్త కొత్త విషయాలు తెరపైకి తెస్తూ బండి సంజయ్ ను మరింత ఇరుకున పెట్టేలా రాజకీయంగా పావులు కదుపుతున్నారు. రాజకీయాల్లో సమయం దొరికనప్పుడే ప్రత్యర్థులపై పై చేయి సాధించే విధంగా వ్యవహరిస్తున్నారు.
బీజేపీ సైలెంట్….
బీజేపీ మాత్రం ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదని తేల్చేసింది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రాంచందర్ రావ్ ఈ విషయాన్ని ప్రకటించారు. బండి సంజయ్ కుటుంబ వ్యవహారమని ఆయనే దీనిపై తేల్చుకుంటారని ప్రకటన చేశారు. బీజేపీ అధ్యక్షులుగా ఉన్న సమయంలో బండి అనుసరించిన విధానంతో ఇప్పుడు పార్టీ క్యాడర్ మద్దతు తప్ప నేతల మద్దతు బండి సంజయ్ కు సొంత పార్టీలో కూడా దక్కడం లేదు. ఇక హై కమాండ్ ఎలాంటి అభిప్రాయంతో ఉందో ఇప్పటికీ ఎవరికీ అంతు చిక్కడం లేదు.
నాకు వ్యక్తి గతంగా నచ్చదు….
తెలంగాణా రాజకీయాల్లో మహిళా అధ్యక్షురాలిగా ఉన్న ఏకైక పార్టీ టీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత్రి కవిత స్పందించిన తీరు కూడా ఆసక్తి కర చర్చకు దారి తీస్తోంది. ఈ కేసులో మహిళగా తన మద్దతు బాధితురాలికి ఉంటుందని, అయితే బీఆర్ఎస్ సోషల్ మీడియా అనుసరించిన వైఖరి సరైంది కాదని తప్పు బట్టారు. మైనర్ అమ్మాయి పై జరిగే ప్రచారం ఆ అమ్మాయికి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉందన్నారు. ఇదే సమయంలో రాజకీయాల్లో లేని అబ్బాయి గురించి మాట్లడడం కూడా నాకు వ్యక్తిగతంగా నచ్చదని తేల్చేశారు.
భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో బాలిక మైనరా కాదా అన్న విషయాన్ని పోలీసులు విచారణ జరిపి తేలుస్తారు. దోషులైతే కోర్టు నిర్ధారిస్తుంది. పోక్సో కేసు నమోదైతే మాత్రం భగీరథ్ కు కఠిన శిక్ష తప్పదు. పోక్సో కేసులో ఎలాంటి శిక్షలుంటాయో తెలుసుకోండి












Leave a Reply