NewsInn

News in a Click

బండి సంజ‌య్ కు పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ టెన్ష‌న్

బండి సంజ‌య్ కు పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ టెన్ష‌న్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఇటీవ‌లే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు పూర్తి కావ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం మంత్రి వ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌పై దృష్టి పెట్టింద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నెల‌లో ప్ర‌ధాని విదేశీ ప‌ర్య‌ట‌న అనంత‌రం మంత్రి వ‌ర్గంలో మార్పులు చేర్పులు ఉండే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణా నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ఇద్ద‌రు మంత్రుల్లో ఒక‌రు సేఫ్ గా ఉంటారని అంటున్నారు. మ‌రో మంత్రి త‌న‌యుడి ప్ర‌భావం రాజ‌కీయంగా తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తుండ‌డంతో మ‌రో మంత్రి టెన్ష‌న్ లో ఉన్నార‌ట‌. ప్ర‌ధాని మోడీ హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు ముందు ఈ ఘ‌ట‌న జ‌రిగినా….కేంద్ర మంత్రి త‌న‌యుడు కావ‌డంతో పోలీసులు కూడా సంయ‌మ‌నం పాటించారు. ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న ముగియ‌డంతో సీఎం ఆదేశాల‌తో కేసు విచార‌ణ‌లో పోలీసులు వేగం పెంచారు. వాస్త‌వ ప‌రిస్థితులు ఎలా ఉన్నా….. ఓ మైన‌ర్ బాలిక వ్య‌వ‌హారం కావ‌డంతో సున్నిత అంశంగా మారింది.

కుటుంబ స‌మస్య అంటున్న బీజేపీ….

బిజేపీ నేత‌లు ఈ కేసు గురించి ఎక్క‌డా స్పందించ‌డం లేదు. ఇది బండి సంజ‌య్ వ్య‌క్తి గ‌త విష‌య‌మ‌ని చాక‌చ‌క్యంగా దాట వేస్తున్నారు. ఇత‌ర రాజ‌కీయ పార్టీల నేత‌ల కుటుంబ స‌భ్యులు ఇలాంటి కేసుల్లో ఇరుకున్న సంద‌ర్భంలో బీజేపీ నేత‌లు చేసిన హ‌డావుడిని ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేత‌లు గుర్తు చేస్తున్నారు. అప్పుడు అది వారి కుటుంబ స‌మస్య కాదా అన్న వాద‌న‌ను తెర‌పైకి తెస్తున్నారు. గ‌తంలో మాజీ హోమంత్రి మ‌న‌వ‌డి కేసు విష‌యంలో బీజేపీ చూపిన అత్యుత్సాహం ఇప్పుడెందుకు లేద‌న్న‌ది ఆ పార్టీ నేత‌ల ప్ర‌శ్న‌…. అయితే రాజ‌కీయంగా బండి దూకుడుకు పార్టీలో కూడా బ్రేకులు వేసేందుకు అవ‌కాశం వ‌చ్చింద‌ని బీజేపీ నేత‌ల్లో కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ కార‌ణంగానే బండి త‌న‌యుడి కేసు విష‌యంలో బీజేపీ హైక‌మాండ్ కూడా ఆరా తీసింద‌ని తెలుస్తోంది. ఇక్క‌డ భ‌గీర‌థ పై న‌మోదైన కేసు విష‌యంలో పార్టీకి లేదంటా సంజ‌య్ పై ఏ మేర‌కు ప్ర‌భావం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు స‌మాచారం. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను టార్గెట్ చేస్తున్న బీజేపీ అగ్ర నేత‌లు కూడా ఈ వ్య‌వ‌హారంపై ఆగ్ర‌హంగా ఉన్న‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది.

బండి టెన్ష‌న్ తో నే వ్యాఖ్య‌లు….

ఈ కార‌ణంగానే బండి సంజ‌య్ త‌న త‌న‌యుడి గురించి ఆయ‌నే బ‌హిరంగంగా వ్యాఖ్య‌లు చేసే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని అంటున్నారు. ఇటీవ‌ల క‌రీంన‌గ‌ర్ లో జ‌రిగిన యాత్ర‌లో సంజ‌య్ చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న లోని బ‌య‌ట పెట్టాయి. రాజ‌కీయాల కార‌ణంగా త‌న కుటుంబానికి స‌మ‌యం కేటాయించ‌క‌పోయాన‌ని చెప్పుకొచ్చారు. ఇది త‌ప్పే అని క్ష‌మాప‌ణ‌లు కోరారు. మంత్రి వ‌ర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ ప్ర‌చారంతోనే సంజ‌య్ ఇలాంటి వ్యాఖ్య‌లు చేశార‌న్న ప్ర‌చారం కూడా ఉంది. పార్టీకి పూర్తి స‌మ‌యం కేటాయించాన‌ని చెప్పుకోవ‌డం కూడా రాజ‌కీయ వ్యూహ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే బండి త‌న‌యుడు కేసులో ఇరుక్కోవ‌డంతో ఆ పార్టీలోని బండి వైరి వ‌ర్గం బండి పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో స్థానం కోల్పోతే త‌మ‌కు అవ‌కాశం ఉంటుంద‌న్న ధీమాతో ఉన్నార‌ట‌. మొత్తం మీద కేంద్ర మంత్రి వ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ తెలంగాణా బీజేపీ నేత‌ల్లో కొత్త ఆశ‌లు నింపుతోంది. ఇదే స‌మ‌యంలో సంజ‌య్ లో మ‌రింత టెన్ష‌న్ పెంచుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *