NewsInn

News in a Click

పెట్రో ధరలు లీటరుకు రూ.3 పెంపు

పెట్రో ధరలు లీటరుకు రూ.3 పెంపు

(హైదరాబాద్,న్యూస్ ఇన్)

దేశవ్యాప్తంగా పెట్రోల్ లీటరుకు సగటున రూ.3, డీజిల్ లీటరుకు రూ.3 చొప్పున పెంచుతూ చమురు సంస్థలు ఉత్తర్వులు జారీ చేశాయి. పెరిగిన ఈ ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. దీంతో వాహనదారులు బంకుల వద్దకు వెళ్లేసరికి కొత్త ధరల ప్రకారం డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. తెల్లారేసరికి పెట్రోల్ ధరలు పెరగడంతో కొంతమంది వాహనదారుడు బంకుల దగ్గర వాగ్వాదం చేయడం కూడా కనిపించింది. ప్రధాని మోడీ హైదరాబాదులో పర్యటించిన సందర్భంగా నే పెట్రోల్ ధరలను దేశాలు పెంచాలని ఇక్కడ జరిగే అవకాశం ఉందన్న సంకేతాలను ఇచ్చారు. ఇంధన వనరులను పొదుపు చేయాలన్న సూచనలు చేశారు.

పెంపుకు కారణాలు….

ముడి చమురు సెగ: అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 110 డాలర్ల మార్కును దాటింది

ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల సరఫరా చైన్ దెబ్బతింది.

గత కొన్ని వారాలుగా ధరలు పెంచకపోవడం వల్ల చమురు కంపెనీలు నష్టాన్ని చవిచూస్తున్నాయి.

పెంచిన ధరలతో దేశవ్యాప్తంగా పెట్రోల్,డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి

Petro products price hike

దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్‌పై రూ. 3.00 పెరగడంతో కొత్త ధర రూ. 97.77కు చేరింది.

ఆర్థిక రాజధాని ముంబైలో రూ. 3.10 పెరిగి రూ. 106.64 కు పెరిగింది

కోల్‌కతాలో రూ. 3.29 పెంపుతో రూ. 108.74కు,
చెన్నైలో రూ. 3.10 పెంపుతో రూ. 103.90కు ధరలు చేరాయి.

హైదరాబాద్‌లో అత్యధికంగా రూ. 3.39 పెరగడంతో లీటరు పెట్రోల్ ధర రూ. 110.89కి చేరింది.

గుంటూరులో లీటర్ పెట్రోల్ రూ.112.64 గా దేశంలోనే టాప్ లో ఉంది

బెంగళూరులో రూ. 106.17, తిరువనంతపురంలో రూ. 110.75గా కొత్త ధరలు అమలవుతున్నాయి

డీజిల్ ధరలు ఇలా….

డీజిల్ ధరలు కూడా ఇదే స్థాయిలో పెరిగాయి. న్యూఢిల్లీలో లీటరు డీజిల్ రూ. 90.67 (+రూ. 3.00) కాగా, హైదరాబాద్‌లో రూ. 3.26 పెరిగి రూ. 98.96 వద్ద కొనసాగుతోంది. గుంటూరులో రూ.100.34 గా ఉండగా.. దేేశ ఆర్ధిక రాజధాని ముంబైలో రూ. 93.14, కోల్‌కతాలో రూ. 95.13, చెన్నైలో రూ. 95.47గా ధరలు ఉన్నాయి. అత్యధికంగా తిరువనంతపురంలో డీజిల్ ధర రూ. 99.63కు చేరువయ్యింది. స్థానిక వ్యాట్ (VAT), డీలర్ కమిషన్ల ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో ధరల్లో స్వల్ప మార్పులు ఉండనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *