NewsInn

News in a Click

కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా…రాగిడి లక్మారెడ్డి

(హైద‌రాబాద్, న్యూస్ ఇన్‌)

నాచారం ఇండ్ర‌స్టీయ‌ల్ పార్క్ లోని షాహీ ఎక్స్ పోర్ట్ కంపెనీలో జీతాలు చెల్లించ‌క‌పోవ‌డంతో ఆందోళ‌న బాట ప‌ట్టిన కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా మ‌ల్కాజిగిరి పార్ల‌మెంట్ ఇంచార్జ్ రాగిడి ల‌క్షారెడ్డి కార్మికుల‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు.సుమారు వారం రోజులుగా కార్మికులు ఎంత నిరసన వ్యక్తం చేసినా యాజమాన్యం మాత్రం స్పందించ‌క‌పోవ‌డం…. లక్ష్మారెడ్డి గారు కంపెనీకి వచ్చేసి ధర్నా చేస్తున్న మహిళలకు సంఘీభావం తెలియజేసి అక్కడే ఉన్న జిఎం తో మాట్లాడి తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలంటూ మీ యాజమాన్యంతో మాట్లాడించాలంటూ డిమాండ్ చేయడం జరిగింది. సమస్య పరిష్కారానికి కృషి చేయని పక్షంలో కంపెనీలో పనిచేస్తున్న కొద్ది మంది మహిళలను బయటకు తీసుకువచ్చేసి కంపెనీ లో ప‌నిచేస్తున్న వారిని కూడా అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రించ‌డంతో త్వ‌ర‌లో జీతాల స‌మ‌స్య ను ప‌రిష్క‌రిస్తామ‌ని యాజ‌మాన్యం హామీ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *