రాష్ట్ర రాజకీయాలపై చర్చ
(హైదరాబాద్, న్యూస్ఇన్)
రాష్ట్రంలో బీజెపి పార్టీ పరిస్థితి పై ప్రదాని మోడీ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో దిద్దు బాటు చర్యలను ఎంపీలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాల సందర్బంగా ఢిల్లీలోనే ఉన్న ఎంపీలంతా సమావేశం అయ్యారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నివాసంలో ఎంపీలు కలుసుకున్నారు.
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ , ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ , ధర్మపురి అరవింద్ , రఘునందన్ రావు , కొండా విశ్వేశ్వరరెడ్డి , గొడం నగేశ్ , ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు.

పార్టీని పటిష్టం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా ఎంపీలు చర్చించినట్లు తెలుస్తోంది.ప్రధాని మోడీ ఎంపీలకు కొన్ని రోజుల క్రితం క్లాస్ తీసుకోవడంతో…ఎంపీలంతా కలిసి కట్టుగా ఉన్నామన్న సంకేతాలు కూడా ఈ సమావేశం ద్వారా ఇస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరిస్తితిని అంచనా వేస్తూనే…రాబోయే రోజుల్లో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను, పార్టీకార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా ప్రభుత్వ వైఫల్యాలపై మరింత దృష్టి పెట్టి ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలన్న అభిప్రాయాన్ని ఎంపీలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజెపి అద్యక్షులురామచంద్రరావు నేతృత్వంలో తెలంగాణలో పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయడం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ, మునిసిపాలిటీ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రత్యేకమైన వ్యూహంతో పనిచేయాలని ఎంపీలు నిర్ణయించారు.





Leave a Reply