NewsInn

News in a Click

4 న అఖిలపక్ష సమావేశం

4 న అఖిలపక్ష సమావేశం

(హైదరాబాద్, న్యూస్ఇన్)

ఈనెల 4వ తేదీన అన్ని పార్టీల ప్రతినిధులతో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.
ఉద్యమకారులను గుర్తించి, వారిని సముచిత రీతిలో గౌరవించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ డా.బీ.ఆర్.అంబెడ్కర్ రాష్ట్ర సచివాలయంలో 6వ అంతస్తులోని రూమ్ నెంబర్ 33 లో 4 వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరై తమ విలువైన సలహాలు, అభిప్రాయలు తెలిపేందుకు ఒక్కో పార్టీ నుండి ఇద్దరు ప్రతినిధులను నామినేట్ చేయాలని ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలను కోరింది. ఈ పార్టీల ప్రతినిధులు 4వ తేదీ సమావేశానికి హాజరయ్యేందుకు సచివాలయంలోకి ఏవిధమైన ఇబ్బందులు లేకుండా ప్రవేశించేందుకు వీలుగా ముందస్తుగా తెలంగాణ రాష్ట్ర సచివాలయ చీఫ్ సెక్యూరిటీ అధికారి దేవీదాస్ (87126 66004 ) ను సంప్రదించాలని ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *