
(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ నగరంలోని మల్కాజ్గిరి ప్రాంతంలో భార్యను తుపాకీతో భర్త అరుణ్ కాల్చి చంపారు.
గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.ఈ తెల్లవారుజామున మాట్లాడుకుందాం రమ్మని భార్యని ఇంట్లో నుంచి బయటకు రప్పించి మరో వ్యక్తితో కలిసి అరుణ్ ఈ తారడానికి ఒడిగట్టారు. భర్తతో విభేదాలతో గత కొన్ని రోజులుగా భార్యా ఉషారాణి అరుణ్ దూరంగా ఉంటున్నారు. అక్రమంగా తుపాకీ కొనుగోలు చేసిన అరుణ్ కొన్ని రోజుల క్రితం అంబర్పేట ప్రాంతంలో తుపాకీతో హల్చల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాతబస్తీకి చెందిన కొంతమంది స్నేహితుల ద్వారా తుపాకీని అరుణ్ కొనుగోలు చేసినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు.











Leave a Reply