NewsInn

News in a Click

కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ కు ఎంపీకై…. వేధింపులు….!

కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ కు ఎంపీకై…. వేధింపులు….!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ఉన్న‌తాధికారులు వ్య‌వ‌హ‌రించిన తీరుతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఉన్న‌తా దేశంలోనే అత్యున్న‌త హోదా ద‌క్కే హోదా ద‌క్కించుకున్న ఓ యువ అధికారి శిక్ష‌ణ పొందుతూ… త‌న స‌హ‌చ‌ర మ‌హిళా అధికారిని వేధింపుల‌కు గురి చేసిన ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

దేశంలోనే అత్యంత ప్రాధాన్య‌త ఉన్న సివిల్ సర్వీసెస్ ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణ‌త సాధించి దేశానికి సేవ చేసేందుకు సిద్దం అవుతున్నారు. క్ర‌మ‌శిక్ష‌ణ వారికి మొద‌టి ప్రాధాన్య‌త‌….అదే ఇండియ‌న్ పోలీస్ స‌ర్వీస్…. శాంతిభ‌ద్ర‌త‌లు కాపాడ‌డంలో వారు తీసుకునే నిర్ణ‌యాలే కీల‌కం. కింది స్థాయి అధికారులంతా భ‌విష్య‌త్ ఉన్న‌తాధికారుల తీసుకునే నిర్ణ‌యాల‌ను అమ‌లు చేయాల్సిందే.. బాధ్య‌త‌ల ప‌రంగా వారు నిర్వ‌హించే ఉద్యోగ బాధ్య‌త‌లు అలా ఉంటాయి. దేశంలోనే అత్యంత క్లిష్ట‌మైన ప‌రీక్ష‌లు దాటుతూ ఉన్న‌త స్థానానికి చేరుకునే కాబోయే ఐపీఎస్ అధికారులు కూడా అదుపు తప్పుతున్నారు.

శిక్ష‌ణ‌లో ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌గా ఉండాల్సిన అధికారులు ఇక్క‌డే గాడి త‌ప్పితే ప‌రిస్థితులు ఎలా ఉంటాయో అర్ధం చేసుకోవ‌చ్చు. ఎదో ఆవేశంలో జ‌రిగిన సంఘ‌ట‌న అని అనుకునే ప‌రిస్థితి లేకుండా ఎంతో ప‌రిణితితో వ్య‌వ‌హ‌రించాల్సిన ఆ కాబోయే ఉన్న‌తాధికారుల వ్య‌వ‌హారం ఇప్పుడు తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది. హైద‌రాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడ‌మీలో జ‌రిగిన సంఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. భ‌విష్య‌త్తులో మ‌హిళ‌ల‌కు అండ‌గా ఉంటూ భ‌రోసా క‌ల్పించే విధంగా నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అధికారే త‌న కొలీగ్ తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌న్న ఆరోప‌ణ‌ల‌తో కేసులో ఇరుకున్నారు. పోలీస్ అకాడ‌మిలో శిక్ష‌ణ పొందుతున్న ఉద‌య్ క్రిష్ణా రెడ్డి అక్క‌డే శిక్ష‌ణ పొందుతున్న శిక్ష‌ణ‌లో ఉన్న కాబోయే మ‌హిళా ఉన్న‌తాధికారిణిని గ‌త కొన్ని రోజులుగా వేధింపుల‌కు గురి చేస్తున్నారు.

ఫోన్ లో అస‌భ్య‌క‌ర‌మైన మెసెజ్ లు పెడుతూ లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డుతూ వ‌చ్చారు. క్రిష్ణారెడ్డి ఆగ‌డాలు శృతి మించ‌డంతో మ‌హిళా అధికారిని అత్తాపూర్ పోలీస్ ల‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇక కాబోయే ఐపీఎస్ అధికారిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు మొద‌లు పెట్టారు.

కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ కు ఎంపికై……

కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తున్న ఉద‌య్ క్రిష్ణా రెడ్డిని ఉన్న‌తాధికారి శాఖా పరంగా చేసిన వ్యాఖ్య‌ల‌తో
ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ సాధించారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్పుడు లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కోవ‌డంతో మ‌రోసారి ఉద‌య్ క్రిష్ణా రెడ్డి వ్య‌వ‌హారం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది. క‌సితో సివిల్స్ సాధించినా… ఆ స్థాయి నిల‌బెట్టుకోలేద‌న్న చ‌ర్చ మొద‌లైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *