(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణా నుంచి జాతీయ రాజకీయాల వరకు సంచలనంగా మారిన కేంద్ర హోమంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పరారీలో ఉన్నారు. గత కొన్ని రోజులుగా భగీరథ్ తో వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తన్నామని భగీరథ్ దొరికితే అన్ని వివరాలు రాబడుతామని సిట్ అధికారి రితిరాజ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల అనంతరం డీజీపీ ఆనంద్ విచారణ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ప్రభుత్వం ఈ కేసు విచారణ కోసం సిట్ వేయడంతో సిట్ అధికారులు విచారణ కోసం అప్పుడే రంగంలోకి దిగారు.

రితిరాజ్ విచారణాధికారిగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి ఇప్పటి వరకు స్థానిక పోలీసులు నమోదు చేసిన అన్ని వివరాలను పరిశీలించారు. బాధితురాలి స్టేట్ మెంట్ నుపరిశీలించారు. ఇక బండి భగీరథ్ ను విచారించే ప్రయత్నం చేస్తున్నామని, భగీరథ్ దొరికితే కేసు ముందుకు వెళుతుందన్న ధీమాను రితిరాజ్ వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కేసుపై పూర్తి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించిన పోలీసులు తొలిసారి భగీరథ్ ను వెతుకుతున్నామని ప్రకటించడం సంచలనంగా మారింది.మరో వైపు ఈ కేసును బాలల హక్కుల కమిషన్ కూడా సీరియస్ గా తీసుకుంది. కేసుపై పూర్తి నివేదిక ఇవ్వాలని పోలీసు అధికారులను ఆదేశించింది. రాజకీయంగా కూడా బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు బండి సంజయ్ ను ఈ కేసు ఆధారంగా టార్గెట్ చేస్తున్నాయి. దీంతో భగీరథ పోక్సో కేసు చుట్టూ తెలంగాణా రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. అయితే…బీజేపీ మాత్రం ఈ కేసు కు తమ పార్టీకి సంబంధం లేదని తేల్చిచెప్పింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావ్ ఇది పూర్తిగా బండి సంజయ్ కుటుంబ వ్యవహారమని తేల్చిచెప్పారు. తాము ఈ కేసు విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని ప్రకటించారు.











Leave a Reply