NewsInn

News in a Click

పార్టీలే వేరు-రెండూ ఒక్క‌టే-ఆ కుట్ర‌లు తిప్పికొట్టాలి

పార్టీలే వేరు-రెండూ ఒక్క‌టే-ఆ కుట్ర‌లు తిప్పికొట్టాలి

(మ‌హ‌బూబ్ న‌గ‌ర్, న్యూస్ఇన్‌)

కోడంగ‌ల్ లో త‌న‌ను అడ్డుకోవాల‌ని బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలు క‌లిసి కుట్ర‌లు ప‌న్నుతున్నాయ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. గ‌త ఎన్నిక‌ల్లో 35 వేల ఓట్ల మెజార్టీతో గెలిస్తే ఆ ఓట్లు తొల‌గించే య‌త్నాలు ఇప్పుడు జ‌రుగుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఎల్ ఏ, బీఎల్ ఓ ల స‌మావేశంలో మాట్లాడారు. రేవంత్ రెడ్డిని దెబ్బ తీసే కుట్ర‌లు ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆ రెండు పార్టీలు క‌లిసి అమ‌లు చేసేంద‌కు సిద్ధం అవుతున్నాయ‌న్నారు. ఆ రెండు పార్టీల పేర్లు వేరైనా వారి ల‌క్ష్యం ఒక్క‌టే అన్నారు. కాంగ్రెస్ కు ఓట్లు వేసిన వారి ఓట్లు తొల‌గించే కుట్ర‌లు చేస్తున్నార‌న్నారు. ద‌ళితులు, ఎస్టీలు, మైనార్టీల ఓట్ల‌ను టార్గెట్ చేస్తున్నాయన్నారు. ఇలాంటి వారికి పార్టీ నేత‌లు బుద్ధిచెప్పాల‌న్నారు. దొంగ దెబ్బ తీసేందుకు ఆ రెండు పార్టీలు క‌లిసి ప‌నిచేస్తున్నాయ‌ని ఆరోపించారు. రాష్ట్ర స్థాయి కార్య‌క్ర‌మాల్లో రోజూ బీజీగా నేనుంటే కోడంగల్ లో దెబ్బ తీసే కుట్ర‌ల‌ను చేసే వారిని బొంద‌పెట్టాల్సిన బాధ్య‌త మీపై ఉంద‌న్నారు. ఇంట్లో పొంగ‌బెట్టి రేవంత్ రెడ్డిని అడ్డుకునే య‌త్నాలు చేస్తున్నార‌న్నారు.

సంక్షేమ ప‌థ‌కాలు రావు…..

నియోజ‌క‌వ‌ర్గంలో 2,51, 255 ఓటర్లు ఉంటే…. స‌ర్ 1,96,620 ఓట‌ర్ల జాబితాలో స‌వ‌ర‌ణ అయింద‌న్నారు. 54, 635 ఓట‌ర్లు ఇంకా న‌మోదు చేసుకోలేద‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో 22 శాతం ఓట‌ర్లు న‌మోదు స‌ర్ లో న‌మోదు కాల‌ని తెలిపారు. 54 వేల ఓట్లు తొల‌గిస్తే గెలిచిన ఓట్ల కంటే 25 ఓట్లు త‌క్కువ అవుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఓట‌ర్ల జాబితాలో పేరు లేకుంటా ప్ర‌భుత్వ ప‌థ‌కాలు రావ‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అనుమాన‌స్ప‌ద జాబితాలో పేరు చేరిస్తే….. దాన్ని కూడా స‌రిచేసుకోవాల్సిన బాధ్య‌త ఓట‌ర్ల‌పైనే ఉంద‌న్నారు.

సీఎం న‌మోదు….

అంత‌కు ముందు సీఎం రేవంత్ త‌న ఓటును స‌ర్ ప్ర‌క్రియ‌లో ఓట‌ర్ జాబితాలో స‌వ‌ర‌ణ చేసుకున్నారు. అనంత‌రం బీఎల్ఏ, బీఎల్ఓ ల‌తో స‌మావేశం అయి పార్టీ నేత‌ల‌కు దిశా నిర్దేశం చేశారు. ఓట‌ర్ల జాబితాలో ఎవ‌రి పేరు తొల‌గించ‌కుండా చూడాల్సిన బాధ్య‌త పార్టీ నేత‌ల‌పై ఉంద‌న్నారు.

సీఎం ధ‌ర్నా……

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీల‌ను అరెస్టు చేయ‌డాన్ని నిర‌సిస్తూ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోడంగ‌ల్ లో భారీ ర్యాలీ నిర్వ‌హించి అంబేడ్క‌ర్ చౌర‌స్తాలో ధ‌ర్నా నిర్వ‌హించారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొన్నారు. స‌మావేశం అనంతంర పాద‌యాత్ర‌గా అంబేద్క‌ర్ చౌర‌స్తాకు చేరుకుని నిర‌స‌న తెలిపారు. బీజేపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న‌విధానాల‌ను త‌ప్పు బ‌ట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *