NewsInn

News in a Click

కోడంగ‌ల్ లో అభివృద్ధి ప‌నుల‌పై సీఎం సీరియ‌స్

కోడంగ‌ల్ లో అభివృద్ధి ప‌నుల‌పై సీఎం సీరియ‌స్

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ముఖ్య‌మంత్రి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌పై సీఎం రేవంత్ రెడ్డి సీరియ‌స్ అయ్యారు. ముఖ్య‌మంత్రిగా నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తాను క‌ట్టుబ‌డి ఉంటే క్షేత్ర స్థాయిలో జ‌రుగుతున్న ప‌నులు ఏ మాత్రం అమొద‌యోగ్యంగా లేవ‌ని అధికారుల తీరుపై అగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో చేప‌ట్టిన అభివృద్ధి ప‌నుల‌పై సీఎం స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌ధానంగా ఎడ్యూకేష‌న్ హ‌బ్ ఏర్పాటు చేయ‌నున్న ప్రాంతాన్ని ప‌రిశీలించి అధికారులు వ్య‌వ‌హ‌రించిన తీరుపై ఘాటుగా స్పందించారు. హకీంపేటలో ఎడ్యుకేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. ఇక‌పై ప్రతి నెలా పనుల పురోగతిని తనిఖీ చేస్తానని చెప్పారు.ఎడ్యుకేషన్ హబ్‌లో భాగంగా నిర్మిస్తున్న ఇంజనీరింగ్, మెడికల్, నర్సింగ్, వెటర్నరీ కాలేజీలు, ఫిజియో థెరఫీ – పారా మెడికల్ కాలేజీలు, సంబంధిత హాస్టళ్ల నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఎడ్యుకేషన్ హబ్‌లో ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి నెలవారీ పురోగతిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. ఇక నుంచి ప్రతీ నెలా పనుల పురోగతిపై తనిఖీ చేయడమే కాకుండా ఒక రోజు సైట్‌లోనే బస చేస్తానని చెప్పారు.

పనుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అలాంటి వారిని సస్పెండ్‌ చేయడానికి వెనుకాడొద్దని ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వివాద‌స్ప‌దం అయిన ల‌గ‌చర్ల స‌మీపంలో చేసిన భూసేక‌ర‌ణ చేసిన ప్రాంతంలో సీఎం ప‌ర్య‌టించారు. భూములు కోల్పోయిన రైతులకు కూడా ఇప్ప‌టికీ ప్లాట్లు కేటాయింపు జ‌రుగ‌క‌పోవ‌డంతో అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై మండిప‌డ్డారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ర‌హ‌దారి లేని గ్రామాలు, తాండాలు ఉండ‌రాద‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీడీల‌తో నెల రోజుల్లో మండ‌ల స‌మావేశాలు ఏర్పాటు చేసి ఆయా మండ‌లాల‌కు కావాల్సిన అభివృద్ధి ప‌నుల‌పై ప్ర‌తిపాద‌న‌లు ఇవ్వాల‌ని, మండ‌ల స‌మావేశాల‌కు స‌ర్పంచ్ ల‌ను కూడా ఆహ్వానించి అన్ని గ్రామాల నుంచి ప్ర‌తిపాద‌న‌లు తీసుకోవాల‌ని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *