(మహబూబ్ నగర్, న్యూస్ఇన్)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అధికార పార్టీ నేతల్లో జోష్ నింపే విధంగా సాగింది. రెండు రోజుల పాటు కోడంగల్ నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించిన ఆయన సర్ ప్రక్రియ లో భాగంగా ఓటర్ల జాబితా నుంచి ఎవరి పేర్లు తొలగించకుండా నేతలు బాద్యత వహించాలని సూచించారు. నియోజక వర్గంలో ఇంకా 59 వేల ఓట్లకు పైగా ఓటర్లు ఇంకా సవరణ ప్రక్రియలో తమ పేర్లు నమోదు చేసుకోలేదని మండలాల వారిగా ఓటర్లుగా నమోదు చేసుకోని వారి సంఖ్యను వెల్లడించారు. ఇదే సమయంలో సమావేశానికి హాజరైన కార్యకర్తలను, నేతలను పేరు పేరునా పిలుస్తూ…..ఓటర్ల జాబితా సవరణలో వెనుక బడ్డారని చెప్పారు. ఇంకా వారం రోజుల సమయం ఉందని ఇప్పటికైనా నేతలు తమ మండలాల్లో సవరణను పూర్తి చేయాలని సూచించారు.

ఎకరాల్లో కొని…బకరాలకు అమ్మకు……
ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గంలో జరుగుతున్న ఓటర్ల జాబితాపై సీఎం రేవంత్ రెడ్డి చురుకలు అంటించారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డిని ఉద్దేశించి ఎకరాల్లో భూమి కొంటూ…..గజాల్లో బకరాలకు అమ్మకాలను నిలిపి వేసి ముందుగా సర్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పరిగిలో ఎలాగైనా రాంమోహన్ రెడ్డి చేస్తారన్నారు. నారాయణపేటలో డాక్టరమ్మ కంటే శివన్న కే ఎక్కువగా బాధ్యత ఉందని శివకుమార్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కోడంగల్ తో పాటు పొరుగు నియోజకవర్గాల్లో భారీగా ఓటర్ల జాబితా సవరణలో కాంగ్రెస్ పార్టీ నేతలు చురుగ్గా వ్యవహించాలని సీఎం నేతలందరికీ సూచించారు.













Leave a Reply