(హైదరాబాద్, న్యూస్ఇన్)
తెలంగాణాలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ పాతబస్తీలో జరుగుతున్న విధానంపై విచారణ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. డీసీసీ అధ్యక్షుడు ఖలీద్ సైఫుల్లా అనుమానాలు వ్యక్తం చేశారు.
SIR ఓటర్ల జాబితా ఎన్నికల అధికారుల వద్ద కాకుండా రాజకీయ కార్యకర్తల వద్ద ఉంటున్నాయని ఆరోపించారు.
చార్మినార్, బహదూర్పురా మరియు చాంద్రాయణగుట్ట ప్రాంతాల నుంచి వచ్చిన తాజా ఫిర్యాదులు హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ అమలవుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు.చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బూత్ నంబర్ 29కు సంబంధించిన నమోదు ఫారాల విషయమై కాంగ్రెస్ ప్రతినిధులు సంబంధిత బూత్ లెవల్ అధికారిని (BLO) సంప్రదించగా, ఆ ఫారాలు స్థానిక ఎంఐఎం నాయకుడి వద్ద ఉన్నాయని సమాచారం ఇచ్చినట్లు ఖలీద్ సైఫుల్లా తెలిపారు.వాస్తవాలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ ప్రతినిధులు ఆ నాయకుడి నివాసానికి వెళ్లగా దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

బీఎల్ఓల ద్వారా ఓటర్లకు అందాల్సిన ఓటరు పత్రాలు రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తుల వద్దకు ఎలా చేరాయనే ప్రశ్నించారు.బూత్ నంబర్ 219కు సంబంధించి కూడా కాంగ్రెస్ నాయకులకు ఫిర్యాదు అందిందని, సంబంధిత బీఎల్ ఓ కు బుదులుగా ఎంఐఎం కార్యకర్తలు ఆ ఫోన్ ద్వారా సమాధానం ఇస్తున్నారని సైఫుల్లా ఆరోపించారు.చాంద్రాయణగుట్ట,బహదూర్పురా లలో కూడా తమకు ఫిర్యాదులు అందాయన్నారు.చార్మినార్, బహదూర్పురా మరియు చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లోని బూత్ నంబర్లు 29, 31, 32, 102 మరియు 219లకు సంబంధించిన ఫిర్యాదులను భారత ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి మరియు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి వెంటనే పరిశీలించాలిచాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని 170, 203, 301, 101, 109, 180, 113, 117 మరియు 121 పోలింగ్ కేంద్రాల బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లేందుకు నిరాకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఓటర్ల జాబితా సవరణను సక్రమంగా నిర్వహించడంపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సవరణలో అక్రమాలకు పాల్పడుతున్న రాజకీయ పార్టీల నేతలపై చర్యలు తీసుకోవాలన్నారు.రాజకీయ జోక్యం లేకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కాంగ్రెస్ కోరుకుంటుందన్నారు.












Leave a Reply