NewsInn

News in a Click

సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట-డీజీపీ ఆనంద్

సిబ్బంది సంక్షేమానికి పెద్దపీట-డీజీపీ  ఆనంద్

(హైదరాబాద్,న్యూస్ఇన్‌)

పోలీసు సిబ్బంది, వారి కుటుంబాల సంక్షేమమే తెలంగాణ పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ వెల్ఫేర్ సొసైటీ మరియు ఆరోగ్య భద్రత విభాగాల సమీక్ష సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, వాటి పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా సమీక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారి కుటుంబాలకు ఆర్థిక, సామాజిక భరోసా కల్పించేందుకు శాఖ అనేక సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. పోలీసు పిల్లల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు మెరిట్ స్కాలర్‌షిప్‌లు, మెరిటోరియస్ స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే జేఈఈ, నీట్‌తో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక ఆర్థిక సహాయం, స్కాలర్‌షిప్‌లు అందిస్తూ ఉన్నత విద్యను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. సిబ్బందికి వివాహ రుణాలు, వైద్య రుణాలు, విద్యా రుణాలు, మెరిట్ స్కాలర్‌షిప్‌లు, మెరిటోరియస్ స్కాలర్‌షిప్‌లు, అదనపు కార్పస్ ఇన్సూరెన్స్, వివిధ గ్రాంట్లు వంటి సంక్షేమ పథకాల ద్వారా సమగ్ర ఆర్థిక భద్రత కల్పిస్తున్నట్లు డీజీపీ వివరించారు.

సంక్షేమ పథకాల దుర్వినియోగం సహించం…

సంక్షేమ పథకాలను వ్యాపార దందాగా మార్చే ప్రయత్నాలను ఏమాత్రం సహించబోమని డీజీపీ హెచ్చరించారు. సంక్షేమ పథకాలు వాటి అసలు లక్ష్యానికి అనుగుణంగా అమలయ్యేలా ప్రతి ఒక్కరూ నైతిక విలువలను పాటించాలని సూచించారు. కొద్దిమంది స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తే వేలాది మంది పోలీసు కుటుంబాలు నష్టపోయే పరిస్థితి తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *