(హైదరాబాద్,న్యూస్ఇన్)
పాలమ్మినా….పూలమ్మినా….. డైలాగ్ తో పాలమలన్న పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ ఎస్ లో ఉన్నట్లా లేనట్లా అనే గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరైన యువ సంగ్రామ సదస్సుకు గైర్హాజరు కావడం…అదే రోజు సీఎం పర్యటనలో పాల్గొనడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోందిరాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ వీడి కారెక్కిన మల్లారెడ్డి రెండో సారి ఎమ్మెల్యేగా పార్టీ అభ్యర్థిగా తన విద్యా సంస్థలున్న మేడ్చల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అర్ధ బలంతో విజయం దక్కించుకున్నారు. అనంతరం అదే బలంతో క్యాబినెట్లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారన్న ప్రచారం కూడా ఉంది.

ఈ పరిస్థితుల్లో ఐదేళ్ల పాటు మంత్రిగా సేవలందించి మరోసారి మేడ్చల్ లో విజయం దక్కించుకున్నా…రాష్ట్రంలో గులాబీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది ఇక అప్పటి నుంచి మల్లన్న దారి వైపే చర్చలు జరుగుతున్నాయి. ఓ సారి కాంగ్రెస్ అని, మరో సారి బీజేపీ అని ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఈ ప్రచారం తెరపైకి వస్తోంది. తన విద్యా వ్యాపారానికి ఇబ్బంది లేకుండా బీజేపీతో సయోధ్యగా ఉంటూనే….. భవన నిర్మాణాలు, రాష్ట్ర ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండాలన్న లక్ష్యంగా రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు.
మల్లారెడ్డి కొడుకు, కోడలు ఇద్దరు బీజేపీ కి సన్నిహితంగా మెలుగుతుంటే…తన వ్యాపార అనుభవంతో కాంగ్రెస్ పార్టీ తో సత్సంబాదాలు కొనసాగిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం మల్లారెడ్డి కొడుకు, కోడలు తో కలిసి ప్రధాని మోడీని కలిశారు. అనంతరం మల్లారెడ్డి వైద్య కళాశాలలు నిర్వహించే కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ కార్యాలయానికి వెళ్లి అగ్రనేతలతో చర్చలు జరిపారు…ఇలా బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్న సమయంలో ఇటీవల మల్లారెడ్డి ఓ కార్యకర్త పుట్టిన రోజు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు దూమారం రేపాయి.

బీఆర్ ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నాంమనే వ్యాఖ్యలు వైరల్ కావడం…అందుకు అనుగుణంగానే మల్లారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండం కూడా చర్చకు దారి తీస్తోంది. దీనికి కొనసాగింపుగానే ఆయన వేస్తున్న అడుగులు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. బీఆర్ ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యువ సంగ్రామ సదస్సుకు మల్లారెడ్డి దూరంగా ఉన్నారు. నిత్యం యువతతో కలిసి మెలిసి యువత ఆలోచనలకు అనుగుణంగా మట్లాడే పార్టీ సదస్సుకు దూరంగా ఉండడం…అదే రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఘట్ కేసర్ పర్యటనలో కనిపించడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది.
బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కూడా మల్లారెడ్డి తీరుపై సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం జరిగింది. తన విద్యా వ్యాపారాల అవసరాల కోసం అధికారంలో ఉన్న పార్టీలతో సన్నిహితంగా ఉంటున్నారా…బీఆర్ ఎస్ కు దూరం గా ఉండాలని నిర్ణయం తీసుకున్నారా అన్నది ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. ఇక అందరినీ తన మాటలతో బురిడీ కొట్టించే మల్లన్న మీడియాతో మాత్రం ఈ వయస్సులో తాను పార్టీ మారితే ఏం ఉంటుందని ఎదరు ప్రశ్నిస్తూ తప్పించుకునే యత్నాలు చేస్తున్నారు.పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో….మల్లారెడ్డి విషయంలో ఆచి తూచి బీఆర్ ఎస్ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.













Leave a Reply