NewsInn

News in a Click

MI ఓపెన‌ర్ల విధ్వంసం – LSG బౌల‌ర్ల‌కు చుక్కలే

MI ఓపెన‌ర్ల విధ్వంసం – LSG బౌల‌ర్ల‌కు చుక్కలే

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్‌)

ముంబాయి ఇండియ‌న్స్ ఐపీఎల్ ఈ సీజ‌న్ లో అత్య‌ధిక ప‌రుగుల‌ను ఛేదించి విజ‌యం ద‌క్కించుకుంది. ల‌క్నో సూప‌ర్ జెంట్స్ తో జ‌రిగిన మ్యాచ్ ల్ 229 ప‌రుగులు చేసి విజ‌యం ద‌క్కించుకుంది. 6 వికెట్ల తేడాతో ల‌క్నో పై ఘ‌న విజ‌యాన్ని ద‌క్కించుకుంది. భారీ స్కోరు ల‌క్ష్య ఛేద‌న‌లో రంగంలోకి దిగిన ముంబాయి ఇండియ‌న్స్ అందుకు అనుగుణంఆనే బ్యాటింగ్ మొద‌లు పెట్టారు. ముంబాయి ఓపెన‌ర్లు రియాన్ రికెల్ట‌న్- రోహిత్ శ‌ర్మ‌లు తొలి ఓవ‌ర్ నుంచే ల‌క్నో బౌల‌ర్ల‌పై విరుచుకు ప‌డ్డారు. ఈ ఇద్ద‌రు బ్యాటింగ్ చేస్తున్న స‌మ‌యంలో 15 ఓవ‌ర్ల వ‌ర‌కే మ్యాచ్ పూర్తి కావ‌చ్చ‌న్న చందంగా వీరి బ్యాటింగ్ కొన‌సాగింది. తొలి వికెట్ భాగ‌స్వామ్యాన‌కి వీరిద్ద‌రు 10,5 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్ట‌పోకుండా 143 ప‌రుగుల‌ను చేశారు. రియాన్ రికెల్ట‌న్ 32 బాల్స్ ఎదుర్కొని 8 సిక్స్ లు, 6 ఫోర్ల‌తో 83 ప‌రుగులు చేసి 11వ ఓవ‌ర్ చివ‌రి బంతికి ఔట‌య్యారు. రోహిత్ శ‌ర్మ కూడా దాదాపు 44 బాల్స్ ఎదుర్కొని 7 సిక్స్ లు 6 ఫోర్ల‌తో 84 ప‌రుగులు చేసి 14వ ఓవ‌ర్లో ఔటయ్యారు. దీంతో ల‌క్నో బౌల‌ర్లు ఊపీరి పీల్చుకున్నారు.

3వ వికెట్ ముంబాయి ఇండియ‌న్స్ తిల‌క్ వ‌ర్మ రూపంలో త్వ‌ర‌గానే కోల్పోయింది. 13 బాల్స్ ఎదుర్కొని 11 ప‌రుగులు మాత్ర‌మే తిల‌క్ వ‌ర్మ చేశారు. ఇద్ద‌రు బ్యాట‌ర్లు సూర్య‌కుమార్ యాద‌వ్, న‌మ‌న్ ధీర్ లు బ్యాటింగ్ కు కొత్త‌గా రావ‌డంతో ముంబాయి జ‌ట్టు ప‌రుగులు సాధించ‌డంలో వేగం త‌గ్గింది. ఫాం లేమితో ఉన్న సూర్య‌కుమార్ యాద‌వ్ భారీషాట్లు ఆడినా…. కేవ‌లం 12 ప‌రుగులు చేసి ఔట్ కావ‌డంతో 213 ప‌రుగుల వ‌ద్ద ముంబాయి నాలుగో వికెట్ కోల్పోయింది. న‌మ‌న్ ధీర్- విల్ జాక్స్ లు గెలుపు బాధ్య‌త‌లు తీసుకున్నారు.

త‌డ‌బ‌డిన ల‌క్నో మిడిల్ ఆర్డ‌ర్….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *