(స్పోర్ట్స్ డెస్క్, న్యూస్ఇన్)
హవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఆర్ ఆర్ జట్టు భారీ స్కోరు సాధించింది. ఆర్ ఆర్ లో ఛోటా భీం మరో సారి ఆకట్టుకున్నారు. భారీ సిక్స్ లు, ఫోర్లతో ఎస్ ఆర్ హెచ్ పై పరుగుల వరద పారించారు. ఈ మ్యాచ్ లో 103 పరుగులు చేసి వైభవ్ సూర్యవంశీ… ఐపీఎల్ లో 36 బంతుల్లోనే రెండో సారి సెంచరీ నమోదు చేసుకున్నారు. అంతకు ముందు 15 బంతుల్లోనే 50 పరుగులను పూర్తి చేశారు. అత్యంత వేగంగా పరుగులు చేస్తున్న వారి జాబితాలో వైభవ్ చేరి పోయారు. ఇన్నింగ్స్ ప్రారంభించిన యశస్వీ జైస్వాల్- సూర్యవంశీ కి మొదటి బాల్ కు ఒక పరుగు తీసుకుని అవకాశం ఇచ్చారు. గత మ్యాచ్ లో మొదటి బంతికే వైభవ్ ను అవుట్ చేసిన ప్రఫూల్ హింగే బౌలింగ్ లో ఈ సారి కసి తీర్చుకున్నారు. రెండో బంతి నుంచి వరుసగా నాలుగు సిక్స్ లు బాది తొలి ఓవర్లోనే 25 పరుగులను ఆర్ ఆర్ సాధించిది. ఆ తరువాత కూడా వరుసగా ఫోర్లు సిక్స్ లు కొడుతూ వైభవ్ భారీ స్కోరుకు బాటలు వేశారు.
మరో మ్యాచ్ లో భారీ లక్ష్యాన్ని ఉదేసిన పంజాబ్ కింగ్స్…………

ఈ సీజన్ లో పేలవ ఫాంలో ఉన్న జైస్వాల్ ఈ మ్యాచ్ లో కూడా కేవలం పది పరుగులకే పరిమితం అయ్యారు. 2.2. ఓవర్లలోనే 40 పరుగులు చేసిన ఆర్ ఆర్ తొలివికెట్ జైశ్వాస్ రూపంలో కోల్పోయింది. వైభవ్ కు ధృవ్ జురేల్ తోడు కావడంతో జట్టు స్కోరు పెరుగుతూనే వచ్చింది. 12 ఓవర్ల వరకు 152 పరుగులకు జట్టు స్కోరు చేరుకుంది. 12.4 ఓవర్లలో ధృవ్ జురేల్ 35 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్స్ తో 51 పరుగులు చేసి వెనుదిరిగారు. 13.5 ఓవర్లలో 170 పరుగుల వద్ద వైభవ్ 103 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ స్కోరులో 12 సిక్స్ లు ,5 ఫోర్లు ఉన్నాయి. వైభవ్ ఔటైన తరువాత ఆర్ ఆర్ జట్టు స్కోరు లో వేగం మందగించింది. ఆ తరువాత వచ్చిన బ్యాటర్లు భారీ షాట్లు ఆడడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రియాన్ పరాగ్, ఫెరీరా, హెట్మేర్ లు 7,33,11 పరుగులు చేసి ఔటయ్యారు.ఎస్ ఆర్ హెచ్ జట్టులో మలింగా రెండు వికెట్లు తీసుకున్నారు. మిగిలిన బౌలర్లు తలో వికెట్ తీసుకున్నారు.











Leave a Reply