(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ఇన్)
హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో భారీ స్కోర్లు నమోదు కాకున్నా… ప్రేక్షులను అలరించింది. ఎస్ఆర్ హెచ్- చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో 195 పరుగుల విజయా లక్ష్యాన్ని చైన్నై ముందు ఉంచింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన చెన్నై వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్ ప్రఫూల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు క్రీజులో నిలదొక్కుకున్న జెమీ ఓవర్టన్ ను ఔట్ చేయడంతో చెన్నై లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. దీంతో ఎస్ ఆర్ హెచ్ 10 పరుగుల తేడాతో విజయం దక్కించుకుంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఎస్ ఆర్ హెచ్ ధాటిగా ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఆ తరువాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో 20 చెన్నైకి 195 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే SRH బ్యాటర్లు చెన్నై బౌలర్లపై విరుచుకు పడ్డారు. ట్రావిస్ హెడ్ ఆచి తూచి ఆడుతుండగా….అభిషేక్ విధ్వంసం సృష్టించారు.

కేవలం 15 బంతులు మాత్రమే ఎదుర్కొని 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. మరో వైపు హెడ్ అవకాశం వచ్చినప్పుడు అడపా దడపా స్కోరును పరుగులు పెట్టించారు. 6 ఓవర్లలో 75 పరుగులు చేసి హెడ్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.20 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ తో 23 పరుగులు చేశారు. ఫాంలో ఉన్న ఇషాన్ కిషన్ బ్యాటింగ్ వచ్చి తొలి బంతికే వెనుదిరగడంతో చెన్నై ఊపిరి పీల్చుకుంది. క్లాసెన్, అభిషేక్ లు స్కోరును పరుగులు పెట్టించారు. 7.6 ఓవర్లలో 93 పరుగుల స్కోరు వద్ద అభిషేక్ 22 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్స్ లతో 59 పరుగులు చేసి ఔటయ్యారు. అనికేత్ 2 పరుగులు , నితీష్ 12 పరుగులు మాత్రమే చేసి వెంటనే పెవీలియన్ చేరుకున్నారు.
14 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 147 పరుగులుచేసింది. క్లాసెన్ 59 పరుగులు చేసి అన్షుల్ కంబోజ్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యారు. సలీల్ అరోరా 13 పరుగులు చేసి వెనుదిరిగారు. ఇన్నింగ్స్ ధాఠిగా మొదలు పెట్టినా…… తరువాతి క్రమంలో వరుసగా చెన్నై వికెట్లు కోల్పోయింది. జిమీ ఓవర్టన్ 3 వికెట్లు, ముఖేష్ 2 వికెట్లు తీసుకున్నారు. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది.

పరుగులు రాబడుతూనే వికెట్లు కోల్పోతుండడం విజయం ఇరు జట్లను దోబూచు లాడుతూ కనిపించింది. చెన్నై ఓపెనింగ్ జట్టుకు శుభారంభాన్ని ఇవ్వలేకపోయింది. శాంసన్ కేవలం 7 పరుగులు చేసి రెండో ఓవర్లోనే ఔటయ్యారు. ఆయుష్ మాత్రే, రుతురాజ్ గైక్వాడ్ లు జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్ల గలిగారు మరో వికెట్ నష్ట పోకుండా5 ఓవర్లలో 66 పరుగులకు జట్టు స్కోరు చేరుకునేలా ఆడారు. అక్కడ ఆయూష్ మాత్రే పెవిలియన్ చేరుకున్నారు. రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ కు వచ్చి ఒక్క పరుగు కూడా చేయకుండా ఔట్ కావడంతో చెన్నై పై కష్టాల్లో పడింది. షాట్, సర్ఫరాజ్ ఖాన్ లు బాధ్యతా యుతండగా ఆడి మరో వికెట్ కోల్పోకుండా 11 ఒవర్లలో 112 పరుగులకు స్కోరుకుంది. ఇదే స్కోరు వద్ద మరోసారి రెండు వికెట్లను చెన్నై ఒకే సారి కోల్పోయింది.16 ఓవర్లు పూర్తయ్యే సరికి6 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. అవసరమైన రన్ రేట్ పెరుగుతుండడంతో చెన్నై బ్యాటర్టపై వత్తిడి పెరిగింది. క్రీజులో ఉన్న శివం దుబే క్రీజులో ఉండడంతో జట్టు ఆశలు ఇంకా విజయంపై వదులు కోలేదు.154 పరుగుల దగ్గర దుబే కూడా 21 పరుగులు చేసి వెనుదిరిగారు. దీంతో మరోసారి ఎస్ ఆర్ హెచ్ మ్యాచ్ పై పట్టు భిగించింది. చివరి రెండు ఓవర్లలో విజయం కోసం 30 పరుగులు టార్గెట్ గా మారాయి. క్రీజులో జెమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్ లు ఉన్నారు. సన్ రైజర్స్ బౌలర్లలో మలింగా 3 వికెట్లు పడగొట్టగా, నితీష్ రెండు వికెట్లు తీసుకున్నారు. 19వ ఓవర్లో 12 పరుగులు రాబట్టడంతో చివరి ఓవర్లో 18 పరుగులు విజయం అవసరం అయ్యాయి.











Leave a Reply