NewsInn

News in a Click

య‌దగిరి గుట్ట‌ YTD ట్ర‌స్ట్ బోర్డు

య‌దగిరి గుట్ట‌ YTD ట్ర‌స్ట్ బోర్డు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)

ప‌విత్ర పుణ్య‌క్షేత్ర‌మైన యాద‌గిరి గుట్ట‌కు ట్ర‌స్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ స‌ర్కార్ ఆదేశాలు వెలువ‌రించింది. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ఎం. స‌త్యనారాయ‌ణ్ర రెడ్డిని చైర్మ‌న్ గా నియ‌మించ‌డంతో పాటు మ‌రో 17 మందికి స‌భ్యులుగా అవ‌కాశం క‌ల్పించింది. ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవి స‌తీమ‌ణి కొణిదెల సురేఖ‌కు బోర్డులో ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించింది. బోర్డులో 11 మంది స‌భ్యుల‌తో పాటు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శితో పాటు మ‌రో ఆరుగురికి ఎక్స్ అఫిషియో స‌భ్యులుగా ప్ర‌భుత్వం అవ‌కాశం క‌ల్పించింది.

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం ఉద‌యం యాదగిరి గుట్ట దేవాల‌యంపై సుదీర్ఘ స‌మీక్ష నిర్మించిన అనంత‌రం అక్క‌డ‌చేప‌ట్టాల్సిన అభివృద్ది కార్య‌క్ర‌మాల‌పై ప‌లు సూచ‌న‌లు చేశారు. సాయంత్రం బోర్డు ఏర్పాటు చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు విడుద‌ల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *