(హైదరాబాద్,న్యూస్ఇన్)
తెలంగాణా రాజకీయాలు ప్రస్తుతం TRS పేరు చుట్టూ తిరుగుతున్నాయి. 24 ఏళ్ల క్రితం మొదలైన టీఆర్ ఎస్ మారిన రాజకీయ పరిస్థితులతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న లక్ష్యంగా పార్టీ పేరును బీఆర్ ఎస్ గా మార్చుకుంది. అయితే బీఆర్ ఎస్- టీఆర్ ఎస్ రెండు పేర్లు గులాబీ పార్టీవే అన్నది అందరి అభిప్రాయం. పేరు అధికారికంగా బీఆర్ ఎస్ గా మార్చుకున్నా….. ఉద్యమ ప్రభావం, ప్రజల్లో తెలంగాణా సెంటిమెంట్ కలిపి ఇంకా టీఆర్ ఎస్ గానే పిలుస్తున్న వాళ్లు ఉన్నారు. అయితే తాజాగా కల్వకుంట్ల కవిత కూడా తెలంగానా రాష్ట్ర సేన పేరుతో TRS పేరు అబ్రివేషన్ వచ్చే విధంగా ఏర్పాటు చేసింది. దీనిపై సోషల్ మీడియాఓ దూమారం రేగింది. బీఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ దీన్ని అసలు- నకిలీ అని పొలుస్తూ కొన్ని ఉదాహరణలు పెట్టారు. ఇవన్నీ ఒక ఎత్తైతే….తాజాగా ప్రముఖ ఎక్స్ సోషల్ మీడియా వేదిక పై TRS పార్టీ పేరుతో ప్రారంభించిన అకౌంట్ సస్పెండ్ చేస్తున్నట్లు పోస్టు దర్శనమిచింది. ఎక్స్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పేరుపై ఖాతా తెరిచేందుకు నిరాకరించడం ఇప్పుడు హాట్ హాట్ గా మారింది.

సస్పెన్షన్….
సాధారణంగా ప్రముఖ సోషల్ మీడియా వేదికలన్నీ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ను ఖచ్చితంగా అమలు చేస్తాయి. వీటి విషయంలో ఎక్కడా రాజీ పడవు. స్పామ్ కార్యకలాపాలు, అనవసరంగా బల్క్ మెసేజింగ్, ఇతరుల వ్యక్తిత్వాన్ని అనుకరించడ, ద్వేషపూరిత వ్యాఖ్యలు, హింసను ప్రేరేపించే కంటెంట్ లేదా తప్పుదారి పట్టించే సమాచారం ప్రచారం వంటి చర్యలు జరిగినప్పుడు సంబంధిత ఖాతాలను సస్పెండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో @TRS__Party ఖాతా ఎందుకు సస్పెండ్ చేశారన్న దానిపై స్పష్టత లేదు. అధికారికంగా X సంస్థ ఈ సస్పెన్షన్పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
అనుమానాలు…
సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలకు సాధారణంగా అధికారిక వెరిఫికేషన్ గుర్తులు (బ్లూ టిక్) ఉంటాయి. అలాంటి ధృవీకరణ ఉన్న ఖాతాలనే అధికారికంగా పరిగణిస్తారు. అయితే @TRS__Party ఖాతాకు అలాంటి స్పష్టమైన వెరిఫికేషన్ ఉన్నట్లు కనిపించకపోవడంతో ఇది నకిలీ ఖాతాగానే ఎక్స్ భావించి సస్పెండ్ చేసిందన్న వాదన వినిపిస్తోంది. టీఆర్ ఎస్ ఆవిర్భావం….
అప్పీల్ కు అవకాశం…..

సస్పెండ్ చేసిన అకౌంట్ ను మళ్లీ తెరిపించుకునేందుకు ఎక్స్ సంస్థను అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అప్పీల్ పరిశీలించి తిరిగి యాక్టివ్ చేయాలా లేదా అనే నిర్ణయాన్ని సంస్థ తీసుకుంటుంది. సరైన కారణాలు చూపి ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేయాలని విజ్ఙప్తి చేస్తే సంస్థ అంగీకరించే అవకాశం ఉంటుంది. సంస్థకు ఏ మాత్రం అనుమానాం వచ్చినా ఆ ఖాతాలను పూర్తిగా నిషేధించే అవకాశం కూడా ఉంటుంది.
పార్టీలకు సోషల్ మీడియా ….
ప్రస్తుతం సాంకేతిక యుగంలో రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా వేదికలు అత్యంత కీలకం. పార్టీ నిర్ణయాలు, ఇతర పార్టీలు చేసే విమర్శలను కౌంటర్ ఇవ్వడం, పార్టీ విధానాన్ని నేరుగా ప్రజలకు చెప్పడం వంటి అంశాలు సోషల్ మీడియాలోనే అన్ని రాజకీయ పార్టీలు నిర్వహిస్తుంటాయి. దీన్ని అసరాగా చేసుకుని నకిలీ ఖాతాలు సృష్టించి కొంత మంది ఈ వేదికలపై నుంచి టార్గెట్ చేస్తుంటారు. అయితే తాజాగా సస్పెన్ష్ కు గురైన ఖాతా ఎవరిదన్నది తేలాల్సి ఉంది. ఎక్స్ అకౌంట్ సస్సెన్షన్ కావడంతో బీఆర్ ఎస్ సోషల్ మీడియా దీన్ని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇది తెలంగాణా రాష్ట్ర సేన అకౌంట్ గానే చర్చ జరుగుతోంది.











Leave a Reply