(హైదరాబాద్,న్యూస్ఇన్)
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నేతలు సవాళ్లకు సై… అంటున్నారు. ప్రతిపక్ష పార్టీని ఇరుకున పెట్టేందుకు మంత్రి జూపల్లి తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులను నిరూపిస్తానని ప్రకటించారు.బిఆర్ఎస్ పాలనలో అప్పులపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని బీఆర్ ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులపై చర్చకు వస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లు సై ..అన్నారు. తెలంగాణ భవన్ లోనే చర్చకు సిద్ధమని జూపల్లి ప్రకటించడంతో మాజీ మంత్రులు ఇద్దరు తెలంగాణ భవన్ లో గురువారం అందుబాటులో ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

కీలక నేతలు తెలంగాణ భవన్ కు వస్తుండడంతో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.మంత్రి జూపల్లి తెలంగాణ భవన్ కి వస్తే… కేంద్ర ప్రభుత్వ నివేదికలు, రిజర్వు బ్యాంకు లెక్కలతో కాంగ్రెస్ అప్పుల బాగోతాన్ని బయట పెడతామని బిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేసిన అప్పుల పై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ ప్రకటించడంతో సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందిఅయితే మంత్రి జూపల్లి కృష్ణారావు గాంధీభవన్లో నిర్వహించే ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా గాంధీభవన్ లో అందుబాటులో ఉంటారని గాంధీభవన్ వెల్లడించింది.
మరోవైపు గురుకుల టెండర్స్ విషయంలోనూ రాజకీయం హాట్ హాట్ గా మారింది.గురుకుల టెండర్స్ కుంభకోణం పై బహిరంగ చర్చకు వస్తే తాను నిరూపించేందుకు సిద్ధమని టిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. మంత్రులు అడ్లూరి , పొన్నం, అజారుద్దీన్ లకు సవాల్ విసిరారు.

దీనిపై మంత్రులు స్పందిస్తూ
అమరవీరుల స్థూపం వద్దకు కేటీఆర్, హరీష్ రావు లు చర్చకు వస్తే తాము బహిరంగ చర్చకు వచ్చేందుకు సిద్ధమని మంత్రులు కూడా ప్రకటించారు. మరికాసేపట్లో మంత్రులు సీఎల్పీ కార్యాలయానికి వచ్చి అక్కడి నుంచి గన్ పార్క్ కి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న మాజీ మంత్రులు ఎవరు చర్చకు వచ్చిన తామరసిద్దమని మంత్రులు ప్రకటించారు. మాజీమంత్రి చర్చకు వస్తామంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వచ్చేందుకు తమకు అభ్యంతరం లేదన్నారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ క్లబ్ కు మరికాసేపట్లో చేరుకోనున్నారు. నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం హాట్ హాట్ గా మారడంతో పోలీసులు కూడా ఈ వ్యవహారంపై దృష్టి సాధించాల్సి వస్తుంది. తెలంగాణ భవన్,సోమాజిగూడ ప్రెస్ క్లబ్ , అమరవీరుల స్థూపం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు.












Leave a Reply