(హైదరాబాద్,న్యూస్ఇన్)
హైదరాబాద్ హై టెన్షన్ పొలిటిక్స్ కు వేదికైంది.కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీ ల నేతలు సవాళ్లు ప్రతిసవాళ్లతో నగరంలో ప్రస్తుతం ఉన్నచల్లటి వాతావరణంలో రాజకీయ వేడి రాజుకుంది. అటు మంత్రులు, ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు తేల్చుకుందాం రా అంటూ ముందుకు రావడంతో పోలీసులకు ఈ వ్యవహారం చెమటలు పట్టిస్తోంది.
దాదాపు నెల రోజుల క్రితం మాజ మంత్రి హరీష్ రావ్ గురుకుల పాఠశాలల టెండర్ల విషయంలో గోల్ మాల్ జరిగిందని, రూ. 2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు.గతంంలనే మంత్రి దీనికి కౌంటర్ ఇచ్చారు.కానీ ఈ వ్వవహారంలో సంబంధిత శాఖ మంత్రికి సరైన సమాచారం లేదంటూ మాజీ గురుకులాల కార్యదర్శి,బీఆర్ ఎస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి మరో అడుగు ముందుకు వేసి గురుకులాల బాధ్యతలు నిర్వహిస్తున్నముగ్గురుమంత్రులు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రస్తుత మాజీ మంత్రులు ఎవరు చర్చకు వచ్చినాతాము రెడీ అని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరిలక్ష్మణ్, అజహరుద్దన్ లు ఉదయం సీ ఎల్పీకార్యాలయానికి చేరుకున్నారు.

ఇక మరో మంత్రి జూపల్లి కృష్ణరావ్ బీఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలోనే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేటిఆర్, హరీష్ రావ్ లు దీనిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. వారు ఒప్పుకుంటే ఉదయం 11 గంటలకు తెలంగాణా భవన్ కు వస్తానని మంత్రి జూపల్లి ప్రకటించారు. మాజీమంత్రులు ఇద్దరు జూపల్లి సవాల్ తో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించి.. బీఆర్ఎస్ కీలక నేతలిద్దరు తెలంగాణా భవన్ చేరుకున్నారు.కానీ జూపల్లి కృష్ణరావ్ గాంధీ భవన్ లో ప్రజలతో ముఖా ముఖి కార్యక్రమం అనంతరం గన్ పార్క్ కు చేరుకుంటారని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి. మంత్రిజూపల్లి మరోసారి స్పందిస్తూ బావ,మరిది ఇద్దరు కలిసి గన్ పార్క్ కువస్తే అక్కడే సమాధానం ఇస్తా అని ట్విస్ట్ ఇచ్చారు.

మరో ఎపిసోడ్ లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మాజ మంత్రి కొప్పుల ఈశ్వర్, విద్యార్థి సంఘంనేత గెల్లు శ్రీనివాస్ తో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేరుకున్నారు. మంత్రుల డిమాండ్ తో తెలంగాణాభవన్ నుంచి మాజీమంత్రి హరీష్ రావ్ బహిరంగచర్చకు గన్ పార్క్ దగ్గరున్న మంత్రులతో చర్చకు మాజీ మంత్రి హరీష్ రావ్ తెలంగాణా భవన్ నుంచి బయలుదేరారు. హరీష్ రావ్ ను గన్ పార్క్ దగ్గరకు వెళ్లకుండా పోలీసులు తెలంగాణా భవన్ వద్ద పోలీసులు అడ్డుకోవడంంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు మాజీ మంత్రి హరీష్ రావు సహా పలువురు నేతలను అరెస్టు చేశారు.












Leave a Reply